ఇంద్రవెల్లి, జనవరి19 : పవిత్ర గంగాజలంతో మంగళవారం రాత్రి కెస్లాపూర్ మర్రిచెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం ఉద యం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మెస్రం వంశీయుల్లోని పెద్దలు, మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చొని కచేరి నిర్వహించి, నాగోబా పూజలపై చర్చించారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండల కోసం ఉదయాన్నే ఎడ్లబండ్లతో సిరికొండకు వెళ్లి తీసుకొచ్చారు.
వాటిని నాగోబా ఆల యం వెనుకభాగంలో భద్రంగా ఉంచారు. గురువారం రాత్రి మెస్రం గంగారాం, మెస్రం రాము ఇద్దరు వేర్వేరుగా కిక్రి వాయిస్తూ పాటల ద్వారా నాగోబా చరిత్రతోపాటు మెస్రం వంశీయుల్లోని 22 కితల గురించి క్లుప్తంగా మెస్రం వంశీయులకు వివరించారు. నాగోబాకు 21న నిర్వహించే మహాపూలతో పాటు పెద్దల పేరిట అర్ధరాత్రి నిర్వహించే తుమ్(కర్మకాండా)పై మెస్రం వంశీయుల పటేళ్లతో చర్చించారు. మెస్రం వంశీయులోని 22కితల వారీగా మహిళలు సామూహిక వంటలు చేస్తూ నైవేద్యాలను వండుతున్నా రు. మర్రిచెట్ల వద్ద మెస్రం వంశీయులు సా మూహికంగా సహప్తంకి భోజనాలు చేస్తున్నారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు పాల్గొన్నారు.