పుష్య అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర శనివారం అధికారికంగా ముగిసింది. దాదాపు వారం పాటు వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు నాలుగు లక్షలకుపైగా జనం వచ్చినట్లు ఆలయ ఈవో రాజమౌళి తెలిపారు. అనధికారికంగా జాతర రెండు, మూడు రోజులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా.. లేబర్డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణికుముదిని దంపతులుదర్శించుకున్నారు.
– ఇంద్రవెల్లి, జనవరి 28
ఇంద్రవెల్లి, జనవరి 28 : పుష్య అమావాస్య అర్ధరాత్రి (జనవరి 21) మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర.. శనివారం అధికారికంగా ముగిసింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కాగా, ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా భక్తులు నాగోబాను దర్శించుకున్నట్లు ఈవో రాజమౌళి వెల్లడించారు. అనధికారికంగా మరో రెండుమూడు రోజులు కొనసాగుతుందన్నారు.
దర్శించుకున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణికుముదిని..
స్పెషల్ చీఫ్ సెక్రటరీ లేబర్డిపార్ట్ మెంట్ రాణికుముదిని దంపతులు నాగోబాను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంతోపాటు, జాతర చరిత్ర గురించి మెస్రం వంశీయులను అడిగి తెలుసుకున్నారు. వంశీయులతోపాటు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం ఆధ్వరంలో ఆమెను శాలువాతో సన్మానించారు. నాగోబా ఫొటో అందజేశారు. జిల్లా అదనపు శిక్షణ కలెక్టర్ శ్రీజ, ఉట్నూర్ ఆర్డీవో కదం సురేశ్, తహసీల్దార్ ముంజం సోము, సీఐ సైదారావ్, ఐటీడీఏ డీడీ దిలీప్కుమార్, ఐటీడీఏ ఏవో రాంబాబు, ఉట్నూర్ డివిజన్ అసిస్టెంట్ లేబర్ అధికారి గోవర్ధన్, ఆదిలాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి శ్రావ ణి, గిర్ధవార్ మెస్రం లక్ష్మణ్, ఎస్బీ పోలీసులు కోడప రామారావ్, దుర్వా రామన్న, జూనియర్ అసిస్టెంట్లు గంగన్న, నవీన్, మెస్రం వంశీయులు దేవ్రావ్, సోనేరావ్, జంగు, నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ నిధులతో షెడ్ల నిర్మాణం..
జాతర సందర్భంగా మెస్రం వంశీయుల వినతి మేరకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహకారంతో ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ తన కోటా నుంచి రూ.10 లక్షలు మంజూరుచేయగా, 3 ప్రత్యేకమైన షెడ్లను నిర్మించారు. గోవాడ్ ప్రాంతంలో కుటుంబ సమేతంగా మెస్రం వంశీయులు బస చేసేందుకు షెడ్లను నిర్మించినట్లు మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం నాయకులు మెస్రం దేవ్రావ్, మెస్రం శేఖర్బాబు, నాగోబా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం తెలిపారు. అలాగే ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధి పనులతోపాటు నిర్మాణ పనులకు అదనంగా రూ.6 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రేఖానాయక్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.