సిరికొండ, అక్టోబర్ 7 : దేశానికి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు, పింఛన్ దారులు తమవంతుగా టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సోయా పంట విక్రయించిన రైతులు రూ.66 వేలు, పింఛన్ దారులు రూ.50 వేలు కలిపి మొత్తం రూ.1.16 లక్షలను స్థానిక సర్పంచ్ గాడ్గె మీనాక్షికి అందించారు.
దీంతో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన ఫొటోను శుక్రవారం ట్విట్టర్లో పోస్టు చేశారు. భారత రాష్ట్ర సమితికి భారీ మొత్తం తొలి విరాళంగా ఇచ్చిన ముక్రా (కే) దళిత రైతు లు, పింఛన్దారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.