నిర్మల్ టౌన్, డిసెంబర్ 31: జిల్లాలో ‘మనఊరు-మనబడి’ లో భాగంగా చేపట్టిన మోడల్ పా ఠశాల పనులను వారంలోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి పనులపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడుత కింద 260 పాఠశాలల్లో రూ. 81 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. మండలానికి రెండు చొప్పున మోడల్ పాఠశాలలను ఎంపిక చేసి 38 స్కూళ్లలో పనులు పూర్తి చేశామన్నారు. ఈనెల 7 నుంచి 38 పాఠశాలల పనులను ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలిస్తామని చెప్పా రు. ఈనెల 9న జిల్లాకు విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి రానున్నారని, పెండింగ్ పను లు పూర్తిచేస్తే ప్రారంభించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హే మంత్ బోర్కడే, రాంబాబు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చై ర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీలు రామేశ్వర్రెడ్డి, మహిపాల్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మా జీ రాజేందర్, పంచాయతీరాజ్ ఈఈ శంకర య్య, డీఈవో రవీందర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ అశోక్కుమార్, అధికారులు పాల్గొన్నారు.
సైన్స్ఫెయిర్ను విజయవంతం చేయాలి
రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్ను మొదటిసారిగా జిల్లా కు కేటాయించారని, ఉపాధ్యాయులు, అధికారులు సమష్టిగా కష్టపడి విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సైన్స్ఫెయిర్ నిర్వహణపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈనెల 9 నుంచి 11 వర కు నిర్వహించే సైన్స్ఫెయిర్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నట్లు చెప్పారు. 33 జిల్లాల నుంచి 516 మంది విద్యార్థులు, 270 ఉపాధ్యాయులు, గైడ్ టీచర్లు హాజరవుతారన్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. ఓమోజయ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు.
కేంద్రం ఆంక్షల వల్లే ఇబ్బంది..
రాష్ట్రంలో పల్లెలకు మంచి గుర్తింపు రావడం వల్లనే కేంద్రం నిధుల్లో ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. ఉపాధిహామీ పథకం కింద పంట కల్లాలను నిర్మిస్తే వాటి నిధులను తిరిగి వెనక్కి ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతులపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా..? అని ప్రశ్నించారు. పంచాయతీల పెండింగ్ బిల్లులను సంక్రాంతిలోపు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ హామీనిచ్చారని త్వరలోనే రూ. 950 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సర్పంచ్లు ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు.
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 31 : ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చే యాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు. టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీమనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, తొడిశెట్టి రవికాంత్, పోల ధర్మరాజు, చొక్కారావు, వహీద్ ఖాన్, మేడారం శ్రీనివాస్, మతీన్, శివ ప్రసాద్, నాగారాణి, శివరాణి, సాయన్న, రఘువీర పాణి తదితరులు ఉన్నారు.
సర్కారు బడుల బలోపేతానికి కృషి
దిలావర్పూర్, డిసెంబర్ 31: ‘మనఊరు- మనబడి’ కార్యక్రమం ద్వారా విడదల వారీగా సర్కారు బడుల్లో వసతులు కల్పిస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని కాల్వతండా గ్రామంలోని పాఠశాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి కాల్వ గ్రామ సర్పంచ్ ఆడెపు తిరుమల తల్లి రెండు రోజుల క్రితం మృతి చెందగా.. వారి ఇంటికెళ్లి పరామర్శించారు. ఈయన వెంట బన్సపెల్లి సహకార సంఘ చైర్మన్ పీవీ రమణారెడ్డి, మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, ఎంపీ పీ పాల్దె అక్షర, బీఆర్ఎస్ నాయకులు అనిల్, బాపురావు తదితరులు పాల్గొన్నారు.