హాజీపూర్, ఫిబ్రవరి 12 : గ్రామాల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులు రూ.22 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి, హాజీపూర్ తహసీల్దార్ సతీశ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట రవి, గుడిపేట ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, వార్డు సభ్యులు రాజ్కుమార్, గుడెల్లి విష్ణు, నాయకులు మాధవరపు రాజేశ్వర్ రావు, పుస్కూరి శ్రీనివాస్ రావు, బానయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, ఫిబ్రవరి11: మండలంలోని మేదరిపేటలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటీసీ గడ్డం నాగారాణి త్రిమూర్తి, ఎంపీటీసీ కొంగల నవీన్కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అక్కల వెంకటేశ్వర్లు, కంది సతీశ్కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.