దహెగాం, జనవరి10 : రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. ఎంపీపీ కంభగౌని సులోచన అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైద్యంపై చర్చ నిర్వహించగా ఇన్చార్జి మండల విద్యాధికారి భిక్షపతి విద్యాశాఖకు చెందిన నివేదికలను చదివి వినిపించారు. పంచాయతీ రాజ్శాఖ పై చర్చ నిర్వహించగా ఏఈ ఆత్మరాం మాట్లాడుతూ ఎస్డీఎస్ నిధులు ప్రతి పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయని కానీ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. అదేవిధంగా మండలంలో 6 పంచాయతీలకు భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా స్థలం కేటాయించని కారణంగా నిర్మాణ పనులను చేపట్టలేక పోయామన్నారు.
మిషన్భగీరథపై చర్చ నిర్వహించగా డీఈ సిద్దిక్ మాట్లాడుతూ, విషన్ భగీరథ నివేదికలను చదివి వినిపించగా రావులపల్లి, దిగడ గ్రామాల్లో పైపులైన్లు సరిగా లేనందున అక్కడ కొన్ని వాడలకు నీరు అందదడం లేదని సర్పంచ్ జిలేల్ల వెంకటేశ్, జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావులు అన్నారు. పైపుల లైన్ల నిర్మాణనాకి నిధులు లేవని డీఈ తెలుపడంతో జడ్పీ ఫండ్ నుంచి నిధులు ఇస్తామని సమస్యను పరిష్కరించాలని జడ్పీ ఇన్చార్జి చైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. అదేవిధంగా వ్యవసాయం, ఉద్యానవన, రెవె న్యూ,ఎన్ఆర్ఈజీఎస్, ఐకేపీ, వైద్యం తదితర శాఖలపై చర్చ నిర్వహించారు.
మండలంలోని పలు కొత్తరోడ్లు, వంతెనలు,రెన్యూవల్ బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించి నిర్మాణాలు చేపట్టాలని జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో ముఖ్యంగా అటవీశాఖ అనుమతుల కారణంగా నిర్మాణా లు జరుగడం లేదన్నారు. మండలంలో కూడా అటవీశాఖ అనుమతుల కారణంగా ఖర్జీనుంచి మొట్లగూడ వరకు, కల్వాడ నుంచి కొంచవెల్లి వరకు రోడ్లనిర్మాణం జరుగడం లేదన్నారు. అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనుమతులు తీసుకునేందకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర అటవీశాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో మాట్లాడి రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకువచ్చి నిర్మాణాలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకు ంటానని తెలిపారు.అధికారులు రోడ్ల నిర్మాణాం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అధికారులు అభివృద్ధ్దిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. ఇన్చార్జి జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ, మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందకు తనవంతు కృషిచేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ కంభగౌని సులోచన, జడ్పీ ఇన్చార్జి చైర్మన్ కృష్ణారావు, కో ఆప్షన్ సభ్యుడు సిద్దిక్, జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామారావు, ఎంపీడీవో రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.