ఎదులాపురం, ఏప్రిల్ 11 : బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆత్మైస్థెర్యం కల్పించి, వారి హ క్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి బాపూలే అని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఫూలే 197వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని ఫూలే అందించారన్నారు. జయంతి వేడుకల ద్వారా వారు చేసిన సేవలు, త్యాగాలు, పోరాటాలు గుర్తుచేసుకుంటున్నామని, భవిష్యత్ తరాలకు తెలిజేసేందుకు ప్రభుత్వం జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ.. సమసమాజ స్థాపనకు, మహిళల అభివృద్ధికి మహాత్మా జ్యోతిబాఫూలే చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కా ర్యక్రమాలు ఆహ్వానితులను అలరించా యి. అనంతరం పలువురికి కలెక్టర్, జడ్పీ చైర్మన్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముం దు స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో జ్యోతిబాఫూలే విగ్రహానికి ఎమ్మెల్యే జోగు రామన్న పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, డీఎస్సీడీవో భగత్ సునీతా కుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, శ్రీనివాస్, అఖిల భారత మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ దుర్గం శేఖర్, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కైలాస్నగర్లో ఏర్పాటు చేసిన పట్టణ నాయీబ్రాహ్మణ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువా, పూల మాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం పలువురు సభ్యులు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి తనవంతుగా పూర్తి సహకారం అందిస్తానని భరోసా కల్పించారు. కులవృత్తులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ ఆర్థికంగా ఎదిగేలా పలు కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్, నాయకులు రాము, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గౌడ సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జోగు రామన్నను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తుల అభ్యున్నతికి తనవంతు సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు గౌడ సంఘం అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు తిరుమలగౌడ్, అధ్యక్షుడు రమేశ్ చందర్గౌడ్, నాందేవ్ గౌడ్, చంద్ర ప్రకాశ్ గౌడ్, నర్సాగౌడ్, జగదీశ్ గౌడ్, శంకర్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, భీమేశ్ గౌడ్ పాల్గొన్నారు.