బెల్లంపల్లి, నవంబర్ 19: నియోజకవర్గంలో మూడవసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యను ఆదరించాలని ఎమ్మెల్యే సతీమణి దుర్గం జయతార కోరారు. ఆదివారం బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో కౌన్సిలర్ బడికెల కమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి మాట్లాడారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పథకాలను ఆమె ఓటర్లకు సమగ్రంగా వివరించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో చిన్నయ్య గెలిస్తేనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగుతాయని వివరించారు. డబ్బుల సంచులతో వచ్చేవాళ్లని నమ్మకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి కష్ట,సుఖాలకు తోడుగా ఉండే మంచినాయకుడిని ఎంపిక చేసుకోవాలన్నారు.
సంక్రాంత్రి పండుగకు గంగిరెద్దులవలె వచ్చే వారిని నమ్మి ఆగం కావద్దని సూచించారు. 2018 ఎన్నికల్లో ఓడినా, గెలిచినా స్థానికంగా ఉంటానని చెప్పినా గడ్డం వినోద్ ఎన్నికల ఫలితాల తెల్లవారే ఇక్కడి నుంచి ఉడాయించాడని గుర్తు చేశారు. మళ్లీ ఎన్నికల ముందు వస్తున్నాడని, డబ్బులతో మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేయడానికి వస్తున్న ఆయనను నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరని తెలిపారు. స్థానికంగా లేకుండా ఎన్నికల సమయంలో మాత్రమే ఇక్కడికి వచ్చేవారికి ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. ఎన్నికల వేళ మళ్లీ మోసగాళ్లు వస్తున్నారని, ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మహిళాభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృద్ధి పధకాలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మహిళలకు రూ. 3వేల ఆర్థిక సాయం చేయనున్నారని తెలిపారు. మూడు గంటల కాంగ్రెస్ కావాలా…24 గంటల బీఆర్ఎస్ పార్టీ కావాలా ? అని ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. పేదల సంక్షేమ ధ్యేయంగా పది ఏండ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న చిన్నయ్యకు మూడవ సారి ఓటు వేసి దుర్గం చిన్నయ్యను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, తెలంగాణ జాగృతి విభాగం రాష్ట్ర కో కన్వీనర్ సిద్ధం శెట్టి సాజన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ వీ పట్టణ అధ్యక్షుడు సన్నీబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు అన్వర్, నాయకులు బడికెల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి, నవంబర్ 19 : మండలంలోని పలువురు కా్రంగెస్ నాయకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు తోకల వెంకటేశం, మైనార్టీ నాయకుడు సయ్యద్ సర్దార్, కాంగ్రెస్ నాయకులు రాజన్న, తిరుపతి, శేఖర్, మధుకర్, రాకేశ్, హరీశ్, సంతోష్, ప్రకాశ్, రామన్నతో పాటు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభివృద్ధిని చూసీ ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారు బీఆర్ఎస్ అభ్యర్థి చిన్నయ్య గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పురాణం లక్ష్మీకాంత్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగాగౌడ్, సర్పంచు కుబిడె మధుకర్, పీఏసీఎస్ చైర్మన్ కుబిడె వెంకటేశం, నాయకులు వెంకటేశం, సంతోష్, సర్పంచు రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట,నవంబర్ 19: మండలంలోని సోమగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలాగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ పథకాలను వివరించి బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి సంపత్, మునిమడుగుల రాజయ్య పాల్గొన్నారు.