బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 100 మందికి సింగరేణి ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ లబ్ధిదారులకు పట్టాలు అందించారు.
ఏళ్లతరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనని కొనియాడారు. ఆయన వెంట కౌన్సిలర్ అశోక్, నాయకులు నెలకంటి శ్రీనాధ్, నెల్లి రమేశ్, సన్నీ, సుమంత్, లక్ష్మీనారాయణ ఉన్నారు.
– బెల్లంపల్లి, మే 12