ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్/ హాజీపూర్, న వంబర్ 24 : పేదవారికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నా టికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి సీఎస్ సోమేశ్కుమార్, హౌసింగ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.18,328 కోట్లతో 2.91 లక్షల ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తిం చి వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రెండు పడక గదు ల ఇండ్ల పథకంలో భాగంగా జిల్లాలో 572 ఇండ్లు మంజూరయ్యాయని తెలిపారు. అర్హుల ఎంపికకు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామసభలు నిర్వహించి ఇండ్లు కేటాయిస్తామని చెప్పా రు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు చాహత్ భాజ్పాయ్, రాజేశం, డీఆర్డీవో సురేందర్, గిరిజన అభివృద్ధిశాఖ అధికారి మణెమ్మ, కాగజ్నగర్ ఆర్డీవో రాజేశ్వర్, పం చాయతీ రాజ్ ఈఈ పెద్దన్న, సర్వే ఏడీ సోమేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు త దితరులు పాల్గొన్నారు. మంచిర్యాల కలెక్టర్ భార తీ హోళికేరి మాట్లాడుతూ.. రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా జిల్లా లో 1,044 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
జనవరి 15, 2023 నాటికి అర్హులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మిగిలిన 758 నిర్మా ణ పనులు పురోగతిలో ఉన్నందున త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, బీ రాహుల్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి బీ శేషాద్రి, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.