దస్తురాబాద్, ఫిబ్రవరి 6 : మున్యాల గొండు గూడెం, మల్లాపూర్, భూత్కుర్, చెన్నూర్ గ్రామాలకు చెందిన మెస్రం వంశీయులు మంగళవారం ఎడ్ల బండ్లు, కాలి నడకన కేస్లాపూర్లోని నాగోబా మహాపూజకు బయలుదేరారు. అంతకు ముందు మెస్రం కుల దేవతలకు పూజలు చేశారు. ఈ నెల 9 వ తేదీన కేస్లాపూర్లోని నాగోబాకు నిర్వహించే మహా అభిషేకంలో పాల్గొంటామని మెస్రం పెద్ద పటేల్ భీంరావు తెలిపారు. మంగళవారం ఇంద్రవెల్లిలోని మర్రిచెట్టు వద్ద బస చేసి, మరుసటి రోజు బుధవారం కేస్లాపూర్కు చేరుకుంటామని పేర్కొన్నారు. మహాపూజ సందర్భంగా తమ ఎడ్లు, ఎడ్ల బండ్లను అందంగా అలంకరించారు. చలి, వర్షానికి తట్టుకునేలా చిన్న ఇంటి నిర్మాణం మాదిరిగా ఏర్పాటు చేసుకుని నాగోబా దర్శనానికి తరలివెళ్తామని తెలిపారు.