ఇంద్రవెల్లి, జనవరి19 : నిర్మల్లోని తన నివాసంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని మెస్రం వంశీయులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా నాగోబా మహా పూజలతో పాటు జాతర, దర్బార్కు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు. మంత్రి సానుకులంగా స్పం దించారని మెస్రం వంశీయులు తెలిపారు. ఉట్నూర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, నాగోబా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్ పాల్గొన్నారు.
నాగోబాకు మహాపూజలతో పాటు జాతరకు రావాలని కోరుతూ ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం ఎమ్మెల్సీ దండె విఠల్కు గురువారం ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ కార్యదర్శి శుక్లల్ మీణ మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయంలో పూజలు చేశారు. కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, నాగోబా ఆలయ పూజారి మెస్రం షేక్ ఆధ్వర్యంలో ఆయనను సన్మానించి నాగోబా ఫొటోను బహూకరించారు. ఆయన వెంట ఐసీడీఎస్ అధికారులు తదితరులు ఉన్నారు.