నార్నూర్, జనవరి 4 : నాగోబా మహాపూజ(జనవరి 21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు మెస్రం వంశీయులు బయల్దేరిన విషయం తెలిసిందే. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామపంచాయతీ పరిధిలోని బురుకుమ్గూడలో మంగళవారం రాత్రి వారు బస చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఝరికి సంప్రదాయ పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం భోజనాలు చేసి మండలంలోని బొడ్డిగూడ గ్రామానికి పాదయాత్రగా వెళ్లారు. దాబా(బీ), లోకారి(కే), ఝరి, పుణాగూడ తదితర గ్రామాల్లో బేటింగ్ అయ్యారు. అక్క డి నుంచి సాయంత్రం బొడ్డిగూడకు చేరుకోగా.. ఆదివాసులు ఘన స్వాగ తం పలికారు.
గ్రామస్తు లు, మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఝరికి ప్రత్యే క పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడే రాత్రి బస చేశారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం గణేశ్పూర్కు చేరుకుంటామని ఆ వంశం పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదిప్రధాన్ మెస్రం దాదారావ్, ఖాటికటోడ మెస్రం కోసు, కటోడ మెస్రం శేకు, ఝడ్యా మెస్రం బొజ్జు, గాయికి మెస్రం దేవ్రావ్, నాయిక్వాడి మెస్రం దర్ము, సంక్కేపల్లి మెస్రం శాందుర్రావ్, వాడి మెస్రం జంగు, జోప్పా మెస్రం శేకు, ప్రధాన్ నాగోబా పెన్ కోత్వాల్ మెస్రం తిరుపతి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.