ఎదులాపురం, సెప్టెంబర్ 12 : రానున్న ఎన్నిక లు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, అక్రమ రవాణా నిరోధానికి ముందస్తు చర్యల్లో భాగంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఎస్పీ రవీంద్ర సిన్హా పరదేశితో ఆదిలాబాద్ ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎస్పీ మాట్లాడు తూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సమాచార వ్యవస్థ కీలకంగా వ్యవహరిస్తున్నదన్నారు. అంతర్రాష్ట్ర దొంగలు, మద్యం, డబ్బు, దేశీదారు, గంజాయి అక్రమ రవాణా, అ సాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపు మాపవచ్చన్నారు. ఎన్నికల సమయంలో తమ ఉనికిని చాటేలా మావోయిస్టుల ప్రభావం ఉండవచ్చని పేర్కొన్నారు. వారిని అరికట్టేలా మారుమూల ప్రాం తాల్లో సైతం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకొని ఇరు రాష్ర్టాల మధ్య అసాంఘిక శక్తులకు ఆస్కారం ఇవ్వకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రశాంత వాతావరణం లో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. అనంత రం చంద్రాపూర్ ఎస్పీ రవీంద్ర సిన్హా పరదేశి మా ట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ వ్యవస్థకు చంద్రాపూర్ జిల్లా పోలీసుల తరఫున పూర్తి సహా య సహకారాలు అందిస్తామని తెలిపారు. చంద్రాపూర్ జిల్లాలో 24 గంటలు సమాచారం అందించే లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నా రు. కాగా ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి చంద్రాపూర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సమావేశంలో డీఎస్పీలు ఉమేందర్, సీహెచ్ నాగేందర్, శ్రీనివాస్, చంద్రాపూ ర్ డీఎస్పీ నోపని, మల్లికార్జున, సీఐలు కే నరేశ్, ప్రేమ్ కుమా ర్, జైనథ్, గాదిగూడ ఎస్ఐలు పాల్గొన్నారు.