ఆదిలాబాద్ : జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు వద్ద మట్కా నిర్వహిస్తున్న ముఠాపై ఆదిలాబాద్ పోలీసులు గురువారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేసి రూ.2,04,500 నాలుగు సెల్ఫోన్లు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, జిల్లాలోని వివిధ ప్రాంతాల వారితో ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ ఆపరేషన్లో ఆదిలాబాద్ పట్టణం డి.ఎస్.పి ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, సిసియస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి, ఎస్బి ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, జైనథ్ సీఐ మల్లేష్ ,ఎస్ఐ పెర్సిస్, ఎస్బి ఎస్ఐ అన్వర్ ఉల్ హక్ పాల్గొన్నారు.