నిర్మల్ అర్బన్, అక్టోబర్ 3 : నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్మల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్మేళాకు మంత్రి హాజరయ్యారు. కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడరాఉ. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఏటా ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నదని తెలిపారు.
నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా అందుబాటులో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చని చెప్పారు.ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే ప్రైవేట్ మల్టీ నేషనల్ కంపెనీలు లక్షల జీతాలు ఇస్తున్నాయని గుర్తు చేశారు. నిరుద్యోగులు ఈ జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. ఆయా కంపెనీలు ఇస్తున్న ఉద్యోగాలు, జీతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, డీఈవో రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 3 : అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, ఉద్యోగులకు అన్యాయం చేయబోమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్లోని టీఎన్జీవోస్ భవనంలో రూ. 20లక్షలతో నిర్మించిన సమావేశ మందిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిధులు, నియామకాలు, నీళ్ల పోరాటం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చాక ఈ మూడు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణలో పని చేస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులను ఆదుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు, ఉద్యోగోన్నతులు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ కమిషన్ న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5శాతం ఐఆర్ను ఉద్యోగులకు పెంచాలని అవసరమైతే ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు.
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి రూ.25లక్షలు మంజూరు చేయడంతో సంఘం భవన నిర్మాణం పూర్తయిందని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. మరో రూ. 25లక్షలు కేటాయించాలని విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అశోక్, పెన్షనర్ల సంఘం జాతీయ కార్యదర్శి ఎంసీ లింగన్న, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జుట్టు గజేందర్, నాగభూషణం, దళిత సంఘాల నాయకులు రాజేశ్వర్, బొడ్డు లక్ష్మణ్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, డీఈ తుకారాం, టీఎన్జీవోస్ కార్యదర్శి రవికుమార్, నాయకులు సురేందర్, మోహన్రెడ్డి, గంగామణి, భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 3 : తెలంగాణ ప్రభుత్వంతోనే గీత కార్మికులకు న్యాయం జరిగిందని, అటువంటి ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కోరారు. నిర్మల్లోని ఆర్కే ఫంక్షన్హాల్లోనిర్వహించిన మోకుదెబ్బ సిల్వర్ జుబ్లీ ఉత్సవాలకు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్తో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నీరా పాలసీని అమలు చేస్తున్నారని చెప్పారు. గీత కార్మికులు చనిపోతే రూ. 2లక్షల ఎక్స్గ్రేషియాను రూ. 5లక్షలకు పెంచారన్నారు. నీరా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సమైక్యాంధ్ర ప్రభుత్వంలో గీత వృత్తికి అన్యాయం జరిగిందని గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ తెలిపారు. త్వరలో నీరా ఉత్పత్తుల మార్కెట్కు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య, మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్, నాయకులు సురేశ్, సిద్ధిక్, నీరాజగౌడ్, కొండ అర్జున్, శ్రీనివాస్గౌడ్, లింగాగౌడ్, రాజాగౌడ్, కిరణ్గౌడ్ పాల్గొన్నారు. అంతకుముందు నిర్మల్ పట్టణంలోని ర్యాలీ నిర్వహించి సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.