మంచిర్యాల : జిల్లాలోని కోటపల్లి మండల ప్రజల చిరకాల స్వప్నం తుంతుంగ వాగుపై 8 కోట్ల రూపాయలతో శరవేగంగా నడుస్తున్న బ్రిడ్జి పనులను చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే కోటపల్లి మండలం లోని ఏదులబంధం, సిర్సా, పుల్లగామ, రొయ్యల పల్లి, ఆల్గామా, జనగామ, వెంచపల్లి గ్రామాల దశాబ్దాల కష్టాలు తొలగిపోనున్నాయన్నారు. కొద్దిరోజుల్లోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిచేసి మండల వాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం పేదల సంక్షేమానికి పాటుతుందన్నారు.