ఇతర ఏ యూనియన్ గెలిచినా కార్మికులకు నష్టమే
ఆర్కే-5 గనిపై టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్
శ్రీరాంపూర్, ఆగస్టు 12: వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మళ్లీ టీబీజీకేఎస్దే విజయమని యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ ధీమా వ్యక్తం చేశారు.శ్రీరాంపూర్ ఆర్కే -5 బీ గనిపై ఉపాధ్యక్షుడు సు రేందర్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. కార్మికుల ఉద్యోగ విరమణ వ యసు 61 ఏండ్లకు పెంచడం ద్వారా 43 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుందన్నారు. జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన అనేక హక్కులను సీఎం కేసీఆర్ ద్వారా తిరిగి తాము సాధించామని చె ప్పారు. సింగరేణిలో ఏ యూనియన్ ఉ న్నా కార్మికులు నష్టపోతారని, సమస్యలు పరిష్కారం కావన్నారు. గడిచిన ఎనిమిది ఏండ్లలో కార్మికులు ఒక్క సమ్మె చేయకుండా అనేక హక్కులు సాధించుకున్నామన్నారు. జాతీయ కార్మిక సంఘాలు కార్మికులను మభ్యపెట్టి ఉనికి కాపాడుకోవాలని చూస్తున్నారని, మాటలు కార్మికులు నమ్మే పరిస్థితి లేదన్నారు. అనంతరం గని పిట్ కార్యదర్శి సత్యనారాయ ణ, కార్మికులు వెంకట్రావ్ను గజమాల, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మంద మల్లారెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి, ఏరియా కార్యదర్శు లు కానగంటి చంద్రయ్య, నెల్కి మల్లేశం, అద్దు శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు మహేందర్రెడ్డి, పెండ్లి రవీందర్, నాయకులు నీలం సదయ్య, ఆనందం, బండారి శ్రీనివాస్, ప్రవీణ, కాదాసి రాజయ్య, మల్లయ్య, ఎల్లయ్య, సతీశ్, శ్రీనివాస్రావు, అంజయ్య పాల్గొన్నారు.