నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్
బెజ్జూర్, సులుగుపల్లిలో పర్యటన
బెజ్జూర్, ఆగస్టు 10 : పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మండలకేంద్రంతో పాటు సులుగుపల్లి గ్రామంలో మంగళవారం పర్యటించారు. ఎస్సీకాలనీతోపాటు బెస్తవాడలో ఇంటింటికీ తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. డ్రమ్ములు, డబ్బాలు, టైర్లు తదితర వాటిల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. తాగునీటి బావుల్లో బ్లీచింగ్ పౌడరు వేస్తున్నారా? లేదా? అని బెజ్జూర్ జీపీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బెస్తవాడలో పందులు కనిపించడంతో పెంచుతున్న వారికి పంచాయతీ నుంచి నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బుట్టలో వేయాలన్నారు. డ్రైనేజీలను నిత్యం శుభ్రం చేయాలని , సీజనల్ వాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్వో సీతారాం, తహసీల్దార్ జమీర్, ఇన్చార్జి ఎంపీడీవో గంగాసింగ్, వైద్యాధికారి డాక్టర్ రుషి, ఐకేపీ డీపీఎం రామకృష్ణ, సహకార సంఘం చైర్మన్ అర్షద్ హుస్సేన్, ఏపీఎం తిరుపతి, హెచ్ఈవో కోటేశ్వర్, హెచ్బీ రేణుకా దేవీ, సులుగుపల్లి సర్పంచ్ కర్పెత స్వప్న. కార్యదర్శులు, ఐకేపీ సీసీలు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి
పందులు పెంపకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. మండలకేంద్రంలోని బెస్తవాడలో పెంపకందారులతో మాట్లాడారు. గ్రామంలో కాకుండా ఊరి బయట పెంచుకోవాలని కలెక్ట్రు సూచించారు. దీంతో తమకు ఎక్కడా భూములు లేవని వారి కలెక్టర్కు విన్నవించారు. దీం తో వెంటనే పెంపక కుటుంబాల వా రు ఎంతమంది ఉన్నారో వారి జాబి తా తయారు చేసి వారికి ఐకేపీ నుం చి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయాలని డీపీఎం రామకృష్ణకు ఆదేశించారు.