ఆదిలాబాద్ రూరల్ : స్వచ్ఛ తెలంగాణలో భాగంగా స్వచ్ఛ ఆదిలాబాద్కు స్థానిక ప్రజలు సహకరించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సుమారు 300మంది కార్మికులతో ప్రతి రోజు చెత్తచెదారాన్ని తీయిస్తున్నామన్నారు. కాని ప్రజలు చెత్తచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ వేయడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలిసి వస్తుందన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా డంపింగ్యార్డులను ఏర్పాటు చేసిందని, చెత్తను తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. తడి, పొడి చెత్తల కోసం ఇంటింటికి చెత్త బుట్టలు అందజేశామని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త వేయడం వల్ల ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. అనంతరం కళాశాల చుట్టూ ఉన్న ప్లాస్టిక్ను ఏరివేశారు. ఈ కార్యక్రమంలో డివైఎస్వో వెంకటేశ్వర్లు, డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్, కౌన్సిలర్ జాఫర్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పాల్గొన్నారు.