నార్నూర్, జనవరి 7 : తొడసం వంశీయుల మ హాపూజతో మండలకేంద్రంలో శ్రీశ్రీశ్రీ ఖాందేవ్ జాతర శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమైంది. శనివారం ఉదయం ఆ వంశం ఆడబిడ్డ తైలం తాగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు ప్రముఖులు , భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరగా ఘనం గా స్వాగతం పలు కుతూ ఆహ్వానించారు. ప్రజాప్రతినిధులు, అధికారులను శాలువాలతో సన్మానించారు. కుటుంబ సమేతంగా తీసుకువచ్చిన రెండున్నర కిలోల నువ్వుల తైలాన్ని సేకరించారు. ఆ వంశం ఆడబిడ్డ, కటోడలు ఖాందేవ్ ప్రతిమలకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించా రు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జివితీ (తహసీల్) పరిధిలోని కొద్దేపూర్కు చెందిన మెస్రం నాగుబాయి 2.5 కిలోల తైలం తాగి దైవభక్తిని చా టింది. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆడబిడ్డను నూతన వస్ర్తాలతో సన్మానించారు. మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 15 రోజుల పాటు జాతర కొనసాగనున్నది.
భావితరాలకు అందించాలి
ఆదివాసుల ఆచారాలు చాలా గొప్పవని, వాటిని భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం అన్నారు. సంప్రదాయలతో పాటు విద్య, వ్యవసాయం, ఆరోగ్యపరంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆలయ సమస్యను ఎమ్మె ల్యే దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
ఆలయ అభివృద్ధికి పాటుపడుదాం
ఖాందేవ్ ఆలయాభివృద్ధికి అందరం పాటుపడుదామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి తొడ సం భీంరావ్, కటోడలు తొడసం బాపురావ్, తొ డసం ఆనంద్రావ్, తొడసం రాజుపటేల్, పాండుపటేల్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్దేవ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవ్, రాయిసెంటర్ జిల్లా సార్మెడీ మెస్రం దుర్గుపటేల్, జీవ వైవిధ్య కమిటీ జిల్లా సభ్యుడు మ ర్సుకోల తిరుపతి, మడావి మన్కూపటేల్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమేశ్, నాయకులు జాదవ్ రెడ్డి నాయక్, మెస్రం మానిక్రావ్, తొడసం గోపాల్, బండు, మెస్రం శేఖర్బాబు, పూర్ణచంద్ భక్తులు పాల్గొన్నారు.