తాండూర్ : సేంద్రీయ పద్ధతి ( Organic Farming ) లో రైతులు వ్యవసాయం చేస్తే భూములు సారవంతంగా తయారవుతాయని జిల్లా వ్యవసాయాధికారి ఈ సురేఖ( DAP Surekha ) రైతులకు సూచించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా మండలంలోని గోపాల్ నగర్ గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసిందని అన్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ గాట్ల నర్సయ్య అధ్యక్షతన వ్యవసాయ అంశాలు, సేంద్రీయ సాగు పద్ధతుల గురించి రైతులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ నేలలో సేంద్రీయ కర్భన శాతం తక్కువగా ఉందని, కంపోస్ట్ ఎరువులు తగ్గించి పశువుల ఎరువులు కచ్చితంగా వాడుకోవాలని సూచించారు.
ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల దిగుబడి పెంచే మార్గాలు, భూమి సారాన్ని కాపాడుకునే విధానాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా రైతులకు కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే సుష్క, ఏఈవో శంకర్, ఉప సర్పంచ్ గాజుల సునీత, కృషిఖీ, రైతులు పాల్గొన్నారు.