ఎదులాపురం, ఫిబ్రవరి 6: పేదలకు న్యాయపరమైన సహాయం అం దించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం(ఎల్ఏడీసీఎస్) ప్రా రంభమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్.సునీత అన్నారు. సోమవారం ఎల్ఏడీసీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 16 జిల్లాల్లో ఈ కార్యాలయాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. న్యాయ సహాయ మండలి సభ్యు లుగా దాసరి గంగారం, ఆరుగుల అశోక్, ఉమేశ్ డోలే బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రమీణ జైన్, మంజుల, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ న్రాల నగేశ్, న్యాయవాదులు ,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.