గోదావరిఖని, జూలై 16: సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడ మే పెద్ద అదృష్టమని ఆర్జీ-1 జీఎం కే.నారాయణ అన్నారు. ఈ మేరకు ఆర్జీ-1 ఏరియాలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగు ల డిపెండెంట్లు 37 మందికి శనివారం తన కార్యాలయంలో కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని, వీరందరికీ ఆర్జీ-1 ఏరియాలో పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ వచ్చినట్లు వివరించారు. సంస్థలో చేరబోయే యువ కార్మికులు చెడు అ లవాట్లకు దూరంగా ఉంటూ, అంకిత భావంతో పని చేస్తూ సీ నియర్ల నుంచి వృత్తి మెళకువలు, నైపుణ్యతను పెంపొందించుకోవాలన్నారు. తద్వారా సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరా రు. టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు, సీఎంవోఏఐ అధ్యక్షుడు పోనగోటి శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం రాం మోహన్, డీజీఎం పర్సనల్ సీహెచ్ లక్ష్మీనారాయణ, ఏజీఎం ఫైనాన్స్ రామకృష్ణ, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసా ద్, ఎస్వో వీరారెడ్డి, పీవో సారంగపాణి తదితరులున్నారు.
ఆర్జీ 2 ఏరియా పరిధిలో..
ఉద్యోగం బాధ్యతగా గుర్తించి విధి నిర్వహణలో ప్రతిభ చూపి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆర్జీ-2 జీఎం టీ. వెంకటేశ్వర్రావు కారుణ్య నియామక ఉద్యోగులకు సూచించారు. ఆర్జీ-2 ఏరియాలో పలువురు ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. కారుణ్య ఉద్యోగాలు పొందిన 9మందిలో 8మందిని ఆర్జీ-1కు, ఒకరిని ఆర్జీ-2 ఏరియాకు నియమించినట్లు ఆయన తెలిపారు. అత్యంత పెద్ద సంస్థలో ఇంతటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంపై అధికారులు, తోటి సీనియర్ ఉద్యోగులు చెప్పే రక్షణ సూత్రాలను పాటిస్తూ గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెస్క్యూ జీఎం వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఎస్వోటూజీఎం ఎస్. సాంబయ్య, అధికార ప్రతినిధి రాజేంద్రప్రసాద్, సివిల్ డీజీఎం ధనుంజయ్, రెస్క్యూ మేనేజర్ మాధవరావు, ఎస్ఎస్వో పీవీ రమణ, నాయకులు ఐ. సత్యం, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.