ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన్ కోవలక్ష్మి
జైనూర్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపీణి
జైనూర్, మే 25 : నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందజేస్తూ పెద్దన్నలాగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లికి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కరోనా కట్టడికే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. అనంతరం ఎంపీపీ చాంబర్లో నాయకులతో కలిసి పలు సమస్యలపై చర్చించారు. రామునాయక్తండా, డబోలి గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, అదేవిధంగా లాక్డౌన్లో అనుమతి ఉన్న వాహనాలకు సైతం జరిమానా విధిస్తున్నారని, ఒకేరోజు రెండుసార్లు జరిమానా విధించి అన్యాయం చేస్తున్నారని నాయకులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె పోలీసులతో ఫోన్లో మాట్లాడారు. అనుమతి ఉన్న వాహనాను వదిలిపెట్టాలని, ఒకేరోజు ఒకే ఫొటోతో రెండు సార్లు ఎలా జరిమానా విధిస్తారని అలా చేయడం సరి కాదని చెప్పారు. రాష్ట్ర హజ్కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాల, జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ కనక యాదవ్రావ్, ఎంపీపీ కుమ్ర తిరుమల, తహసీల్దార్ సాయన్న, వైస్ ఎంపీపీ చీర్లె లక్ష్మ ణ్, సహకర సంఘం చై ర్మన్ కొడప హన్నూపటేల్, మం డల కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ఖాన్ , సర్పంచ్ లక్ష్మణ్, మడావి భీం రావ్, నాగోరావ్ ఉన్నారు.
పరామర్శ
మండలంలోని పాట్నాపూర్ మాజీ సర్పంచ్ ఇంగ్లే దేవురావ్ కుటుంబ సభ్యులను జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పరామర్శించారు. దేవురావ్ మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె గ్రామంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి భీంరావ్, ఖందారె బాలాజీ తదితరులున్నారు.
పేదబిడ్డలకు అండగా కేసీఆర్ : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తాండూర్, మే 25 : నిరుపేద ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ అం డగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్యతో కలిసి 95 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినప్పటికీ సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వారు పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నారా అని? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని లేకుంటే రాష్ట్ర ప్రజలు తరిమికొడుతారని హెచ్చరించారు. తహసీల్దార్ కవిత, సీఐ బాబురావు, మండల వైస్ ప్రెసిడెంట్ దాగాం నా రాయణ, కో ఆప్షన్ సభ్యుడు నజ్జీఖాన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, మే 25 : పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టణానికి చెం దిన 116 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత, వైస్చైర్మన్ బత్తుల సుదర్శన్, తహసీల్దార్ కుమారస్వామి, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, మధు, మురళి, టీఆర్ఎస్ నాయకుడు జక్కుల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.