ఆసిఫాబాద్,సెప్టెంబర్20 : వ్యాక్సినేషన్ డ్రైవ్కు సహకరించాలని అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ముస్లిం మత పెద్దలతో సోమవారం సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడు తూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో మత పెద్ద లు ఉబేద్బిన్ యాహియా, సలీంబేగ్ ,ముబీద్, షాహిద్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ టౌన్, సెప్టెంబర్ 20: పట్టణంలోని 23,24,4 వార్డుల్లోని వ్యాక్సినేషన్ డ్రైవ్ను అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి సోమవారం పరిశీలించా రు. ప్రజలతో పాటు ఎస్పీఎం అధికారులతో మా ట్లాడి కార్మికులకు 100 శాతం టీకాలు వేసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, కౌన్సిలర్ విద్యావతి, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
బెజ్జూర్, సెప్టెబంర్ 20 : మండలకేంద్రంతో పాటు తుమ్మలగూడ, మర్తిడి సబ్ సెంటర్లను డీపీవో శ్రీకాంత్ సందర్శించారు. రోజుకు వెయ్యి మందికి టీకాలు ఇవ్వాలన్నారు. అనంతరం మార్కెట్ కాం ప్లెక్స్ గదులను పరిశీలించారు. వాటికి సంబంధించిన పంచాయతీ తీర్మానాలు, ఇతర రికార్డులు తనకు సమర్పించాలని సర్పంచ్ అన్సార్ హుస్సేన్కు సూచించారు. ఎంపీడీవో గంగాసింగ్, ఎంపీ వో రమేశ్ రెడ్డి, సర్పంచ్లు, కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 20 : మండలంలోని బా బాపూర్లో వైద్య, పంచాయతీ సిబ్బంది తదితరశాఖల సిబ్బంది సోమవారం వ్యాక్సిన్పై అవగాహన కల్పించడంతో పాటు టీకా వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి , కార్యదర్శి జ్యోతి, నాయకులు రాజన్న, మల్లేశ్ పాల్గొన్నారు.
కెరమెరి, సెప్టెంబర్ 20: మండలంలోని ఝరి, మోడీ గ్రామాల్లో 350 మందికి టీకా వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దత్తారాం, ఝరి, మోడీ సర్పంచ్లు కుమ్రం నాణేశ్వర్, సుమన్బాయి కార్యదర్శులు వాజీద్పాషా, ధర్మయ్య పీహెచ్సీ సూపర్వైజర్ కరుణేశ్వరి, ఏఎన్ఎం మైనుబాయి, తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, సెప్టెంబర్ 20: మండలంలోని ఉషెగాం, పవర్గూడ, జామ్ని, దుబ్బగూడలో క్యాంపును ఎంపీడీవో ప్రభుదయ పరిశీలించారు. వైద్యులు సిడాం నాగేంద్ర, జితేందర్రెడ్డి, హెచ్ఎస్ కిశోర్, రమేశ్, లక్ష్మీకుమారి, హెచ్ఏ భరత్, విజయ్, జంగు, జలపత్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు ఉన్నారు.
లింగాపూర్, సెప్టెంబర్ 20: మండలంలోని ఎల్లాపటార్, లొద్దిగూడ గ్రామాల్లో వ్యాక్సిను వేశారు. సర్పంచ్ రాధాబాయి, కార్యదర్శి సాగర్, ఏఎన్ఎం సంతోషి , తదితరులు ఉన్నారు.
రెబ్బెన, సెప్టెంబర్ 20: మండలంలోని లక్ష్మీపూర్లో రెబ్బెన జడ్పీటీసీ వేముర్ల సంతోష్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ కోలే శ్యాంరావు, ఆలయ కమిటీ చైర్మన్ వోల్వోజి వెంకటేశంచారి పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
కెరమెరి, సెప్టెంబర్ 20: జిల్లాలోని ఆదివాసీలకు ఈ నెల 22న నిర్వహించనున్న వ్యాక్సిన్ డ్రైవ్ను విజయవంతం చేయాలని రాయిసెంటర్ జిల్లా సార్మేడి కోవ దేవ్రావ్ పిలుపునిచ్చారు. ఝరి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఒకే సారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివాసీ నాయకులు ఆత్రం లక్ష్మణ్రావ్, కుమ్రం నాణేశ్వర్, కుడ్మెత సోము, ఆత్రం కుసుంరావ్, పెందోర్ జల్పత్రావ్, కుర్సెంగా ధర్ము, భొజ్జీరావ్ ఉన్నారు.
తిర్యాణి:సెప్టెంబర్ 20: మండలకేంద్రంలోని కుమ్రం భీం భవనం, చింతపల్లి ప్రాథమిక పాఠశాల భవనంలో వ్యాక్సిన్పై అవగాహన కల్పించా రు. జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్,రాయిసెంటర్ సర్మేడీ మోతీరాం, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గుణవంతరావు, ఆయా గిరిజన సం ఘాల నాయకులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
కౌటాల, సెప్టెంబర్ 20: మండలకేంద్రంలోని పం చాయతీ కార్యాలయంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ సెంటర్ను పరిశీలించారు. ఉపసర్పంచ్ పసునూరి తిరుపతి, ఏఎన్ఎం రజిని, సీఏ తిరుపతి, ఏఈవో ఘన్శ్యాం, ఆశ కార్యకర్త మోగ్రా, నాయకులు డబ్బా బాపు, శంకర్, తదితరులు ఉన్నారు.