బాసర, నవంబరు 7 : గోదావరి నది ఒడ్డున ఆలయ అర్చకులు, అధికారులు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కార్తీక హారతిని కనులపండు వగా నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయం నుంచి శోభాయాత్రగా గోదావరి నిత్య హారతి ఘాట్కు వచ్చి నది ఒడ్డున అర్చకులు పుణ్యహారతి జరిపారు.
గోదావరి నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులు వేద మంత్రోచ్ఛ రణల మధ్య ఘనంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఆలయ చైర్మన్ శరత్పాఠక్, బాసర సర్పంచ్ లక్ష్మణ్రావు, ఆలయ అర్చకులు, వైదిక సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.