ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఖతం అయింది. టికెట్ల పంచాయతీ రాజీనామాలకు దారి తీసింది. హస్తం అధిష్ఠానం సీనియర్లను కాదని కంది శ్రీనివాస్రెడ్డికి కేటాయించడంతో పార్టీకి గుడ్బై చెప్పారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మేనల్లుడు, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డి, వివిధ విభాగాల నాయకులు పార్టీ సభ్యత్వానికి, తమ పదవులకు రాజీనామాలు చేశారు. సోమవారం ఆదిలాబాద్లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డి ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. టికెట్ ఇస్తామంటూ ఐదేండ్లుగా వెట్టిచాకిరీ చేయించుకున్న కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ కంటతడి పెట్టారు. కార్యకర్తల సూచనల మేరకు కాంగ్రెస్ రెబల్గా సంజీవ్రెడ్డిని పోటీలో నిలుపాలని నాయకులు నిర్ణయించారు.
– ఆదిలాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ను నిజమైన కార్యకర్తలకు కేటాయించకుండా కమిషన్ల కోసం అమ్ముకున్నారంటూ జిల్లాకు చెందిన నాయకులు పార్టీకీ రాజీనామా చేశారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మంత్రి రామచంద్రారెడ్డి మేనల్లుడు, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డి, వివిధ విభాగాల నాయకులు తమ రాజీనామా పత్రాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్గాంధీ, సోనియాగాంధీలకు పంపారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వైఖరికి నిరసనగా డీసీసీ అధ్యక్షుడు సా జిద్ఖాన్ కంటతడి పెట్టారు. 20 ఏండ్లుగా పార్టీ కో సం కష్టపడుతున్న తనతోపాటు సీనియర్లను పార్టీ విస్మరించిందని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, డీసీసీ అధ్యక్షుడిగా వివిధ పదవులు చేపట్టిన తాను కరోనా కాలంలో ప్రజలకు సేవ చేయడమే కాకుండా.. ఐదేండ్లుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాని గుర్తు చేశారు.
తనకు కాకపోతే బీసీ నాయకురాలు గండ్రత్ సుజాత, సీనియర్ నాయకుడు సంజీవ్రెడ్డికి టికెట్లు ఇవ్వాలని కోరినా అధిష్టానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డబ్బులకు ఆశపడి టికెట్ అమ్మకున్నారని ఆరోపించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ కష్టకాలంలో జెండాను మోసిన తమకు మీ దగ్గర పైసలు లేవంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టికెట్ నిరాకరించారని రాజీనామాలు చేసిన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రాష్ట్ర అధిష్టానం పార్టీ సిద్ధాంతాలు, ఉదయ్పూర్, వరంగల్ డిక్లరేషన్లను పక్కన పెట్టి డబ్బులున్న వ్యక్తులకు టికెట్లు కేటాయించిందన్నారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆర్ఎస్ఎస్ కా ర్యకర్త కంది శ్రీనివాస్రెడ్డికి టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి రాజకీయాలంటే డ బ్బులు అనే ధోరణి తీసుకొచ్చారన్నారు. తమకు కా కుండా డబ్బులున్న వారికి టికెట్ ఇస్తామని చె ప్పడం బాధాకరమన్నారు. కరోనా సమయంలో ఎందరో ఎన్ఆర్ఐలు జిల్లా ప్రజలకు సేవలు అం దించారని, ఆ సమయంలో కంది ఎక్కడ ఉన్నారన్నారు.
కేవలం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో ఆదిలాబాద్కు వచ్చి బీజేపీలో చేరారని, అక్కడ టి కెట్ రాదని తెలుసుకుని కాంగ్రెస్లోకి వచ్చినట్లు తె లిపారు. ఆర్ఎస్ కార్యకర్త అని చెప్పుకున్న కంది శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత తాను సె క్యూలర్ భావాలు కలిగిన వ్యక్తిని అని ఎందుకు అ నడం లేదన్నారు. డబ్బులున్న వారికి టికెట్లు ఇస్తామని ముందుగా చెబితే తాము విదేశాల్లో వ్యాపా రం చేసి డబ్బులు సమకూర్చుకునే వారమన్నారు. నిజమైన వారికి టికెట్లు ఇస్తే తాను సీఎంను కాననే భావనతో రేవంత్ రెడ్డి బీజేపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన వారిని కాదని డబ్బులకు ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని సీనియర్లు సూచించారు. పార్టీకి సేవ చేయకుండా కేవలం కుక్కర్లు పంచిన వ్యక్తికి టికెట్ ఇస్తారా? అని అధిష్టానాన్ని నిలదీశారు. ఇటీవల నిర్వహించిన కార్యకర్తలు సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆదిలాబాద్లో మాజీ మంత్రి దివంగత రామచంద్రారెడ్డి మేనల్లుడు సంజీవ్రెడ్డిని పోటీలో నిలబెట్టుకుని గెలిపించుకుంటామన్నారు. కాంగ్రెస్ కేడర్ తమతో ఉన్నారని తెలిపారు.