భీంపూర్, మార్చి 29 : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది కు టుంబాల్లో సీఎం కేసీఆర్ సంతోషం నింపారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆ యన బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలి సి భీంపూర్ తహసీల్ కార్యాలయంలో 14 మం దికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలను స మంగా ఆదరిస్తూ ఆ మేరకు సహకారం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచులు కరీం, బాదర్, బక్కి అజయ్యాదవ్, హనుమద్దాసు, పెండెపు కృష్ణయాదవ్, నాయకులు కుడిమెత సంతోష్, కాసవేణి అనిల్ యాదవ్ పాల్గొన్నారు.
రోడ్ల మంజూరుపై హర్షం
ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తాంసి మండలంలోని బండలనాగాపూర్, వడ్డాడి, తాంసి, పొన్నా రి, జామిడి, ఈదుల్లాసావర్గాం గ్రా మాలకు సంబంధించి బీటీ రోడ్లు, బ్రిడ్జిలు మంజూరు చేసింది. ఈ క్ర మంలో ఈ గ్రామాల్లో పండుగ వా తావరణం నెలకొన్నది. బండల నా గాపూర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి, మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో రోడ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురుకుంటి మంజుల, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్ గంగుల వెంకన్న, నాయకులు శ్రీధర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.