ప్రకృతి రమణీయమైన అందాలతో కడెం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రాజెక్టు సమీపంలో టీఎస్టీడీసీ ఆధ్వర్యంలో 12 గదులతో ఏర్పాటు చేసిన రిసార్ట్ పచ్చని అందాలతో అలలారుతోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రిసార్ట్ చుట్టూ పక్కల ఫుట్బోర్డ్కు ఇరువైపులా నాటిన మొక్కలు పచ్చదనంతో ఉట్టిపడుతున్నాయి.
ఈ అందాలను తిలకించేందుకు నిత్యం వందల సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం, వర్షాకాలం కావడంతో ప్రాజెక్టు చుట్టూ ఉన్న సహ్యాద్రి కొండల అందాలు పర్యాటకుల మనస్సును కట్టిపడేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు కళావిహీనంగా ఉన్న ప్రాంతం.. స్వరాష్ట్రంలో కళకళలాడుతోంది.
– కడెం, సెప్టెంబర్ 7