“కాంగ్రెసోళ్లకు బాగా పైసలున్నయ్. ఆడ, ఈడ సంపాదించి ఓటుకు రూ.10 వేలు ఇస్తరట. బరాబర్ తీసుకోండి. ఏం బాధలేదు. ప్రమాణం చేయమంటరు. చేస్తూ మనసులోనే తుప్పాల్.. తుప్పాల్ అనుకోండ్రి. కానీ.. చెన్నూర్ చైతన్యం చూపించి, ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి..” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద ర్యాలీ’లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మా తమ్ముడు సుమన్ కాళేశ్వరం బ్యాక్ వాటర్లో భూములు మునుగుతున్నాయని చెప్పాడని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలే.. కరకట్టలు కట్టాలే లేదా ఆ రైతులకు పైసలు ఇయ్యాలే.. అని చెప్పిండు. నేను మాట ఇస్తున్నా.. తమ్ముడిని పెద్ద మెజార్టీతో గెలిపియ్యండి.. ఆ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాని మాటిచ్చారు. చెన్నూర్ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అందరికీ దళితబంధు వస్తుందన్నారు.
– మంచిర్యాల, నవంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
“చెన్నూర్లో పైసల సంచులు దిగినయంటా ఏం చేద్దాం మరీ.. పైసలు జోరుగా తీసుకోండి. ఇస్తే మంచిగ రూ.10 వేలు తీసుకోండి. బాగా బలిసి కొట్టుకుంటున్నరు. వాళ్ల పైసలు తీసుకోండి ఏం కాదు.. కానీ.. ఓటు మాత్రం కారు గుర్తుకు వేయండి.. సోదరుడు, తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు, మీ అందరి అభిమాన నాయకుడు ఐదేళ్లలో చెన్నూర్ రూపురేఖలు మార్చిన యువకుడు, ఉత్సాహవంతుడు, అద్భుతమైన నాయకుడు ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న నాయకుడు మా తమ్ముడు బాల్క సుమన్ను గెలిపించండి..”
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.
మంచిర్యాల, నవంబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెసోళ్లకు బాగా పైసలు ఎక్కువైనయ్. ఆడ, ఈడ సంపాదించి ఓటుకు రూ.10 వేలు ఇస్తరట. ఇస్తే బరాబర్ తీసుకోండి.. ఏం బాధ లేదు. ప్రమాణం చేయమంటరు చేయండ్రి.. చెయ్యి చాపి ప్రమాణం చేస్తూ మనసులోనే తుప్పాల్.. తుప్పాల్.. తుప్పాల్ అనుకోండ్రి.. గుద్దుడు మాత్రం కారు గుర్తుకే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద ర్యాలీ’లో కేటీఆర్ మాట్లాడారు.
పేపర్లు పెట్టి, టీవీలు పెట్టి పైసలు ఎక్కువై చెన్నూర్లో పదిహేను రోజుల ముంగట వచ్చి పైసలు చల్లి గెలుస్తా అంటే బలుపు కాకపోతే.. ఏంది నాకు తెల్వక అడుగుతా అంటూ మండిపడ్డారు. చె న్నూరోళ్లు ఎట్ల కనబడుతున్నరు.. ఇక్కడి ప్రజలు అంగడి సరకు లెక్క కొడుతున్నరా.. ఒక్కసారి చూపెట్టండి.. మీ దెబ్బ చూపెట్టండి.. అని పిలుపునిచ్చారు. ఆ కాంగ్రెస్ ఆయన(వివేక్)కు మనోడి(సుమన్) చేతిలో ఓడిపోవుడు రాసి ఉన్నది. రాజకీయ జీవితం సమాధి అవుడు రాసి ఉన్నదని స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని కాంగ్రెస్ సన్నాసులు.. ఇవాళ వచ్చి మేం అది ఇస్తాం, ఇది ఇస్తాం.. మోచేతికి బెల్లం పెడుతాం.. మా కు ఓటేయండి అని అడుగుతరు. వీళ్లు ఇవాళ వచ్చి చాలా చెప్తరు.. బుదరకిస్తరు.. బ్రతిమిలాడుతరు. కాళ్లు పట్టుకుంటరు.. మూడో తా రీఖు తర్వాత ఇక్కడ ఉండేది మాత్రం సుమన్ ఒక్కడే అన్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేది సుమనే అని తెలిపారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆరే.. ఇక్కడ ఎమ్మెల్యే సుమనే.. అన్నారు. ఎవరో వాళ్లొకరు, వీళ్లొకరు ఊళ్లే అమ్ముడు పోయినోళ్లు ఆగమాగం చేస్తే ఆగం కావొద్దన్నారు. 75 ఏండ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని గుర్తు చేశారు.
రైతుబంధు ఇచ్చింది, ప్రాజెక్టులు కట్టింది, మంచి పనులు చే సింది.. కేసీఆర్ ఒక్కరే అని స్పష్టం చేశారు. మా తమ్ముడు సుమన్ కా ళేశ్వరం బ్యాక్ వాటర్లో కొన్ని భూములు మునుగుతున్నాయని చె ప్పారన్నారు. దానికి సంబంధించి శాశ్వత పరిష్కారం కావాలే.. అ యితే కరకట్టలు కట్టాలే లేదా ఆ రైతులకు పైసలు ఇయ్యాలే అని మీకు మాట ఇస్తున్నా.. తమ్ముడిని పెద్ద మెజార్టీతో గెలిపియ్యండి.. ఆ సమ స్య పరిష్కారం నేను చూపిస్తా. ఎవ్వరు చెప్పిన వినకండి, కాంగ్రెస్ లంగలు చెప్తే అసలు వినకండి. మీరు సుమన్ను గెలిపిస్తే ఆ సమస్య పరిష్కారం చేసే బాధ్యత నాది అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
30వ తేదీన ఓటు బటన్ ఒత్తె ముందు ఒకటే ప్రశ్న మనసులో అడగండి. కరెంట్ కావాల్నా… కాంగ్రెస్ కావాల్నా ఆలోచించుకోండి.. ఎందుకంటే కరెంట్ కావాలంటే కాంగ్రెస్ ఉండద్దు. కాంగ్రెస్ వస్తే క రెంట్ ఉండదు. ఇందులో ఏం అనుమానం లేదని మంత్రి కేటీఆర్ అ న్నారు. ఇదే చెన్నూర్లో సరిగ్గా పదేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంది కరెంట్ పరిస్థితి. ఊళ్లే ఒక రైతు సచ్చిపోయినా, సుట్టపోడు సచ్చిపోయినా, పెద్ద మనిషి సచ్చిపోయినా.. మనమే కదా కరెంటోళ్లకు ఫోన్ చేసి బతిమిలాడుకున్నం. ఒక 20 నిమిషాలు కరెంట్ ఇ య్యండని బతిమిలాడుకున్న రోజులు వాస్తవమేనా.. నిజమేనా.. ఒక్కసారి గట్టిగ కాంగ్రెస్ నా కొడుకులకు సిగ్గు వచ్చేలా చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రేవంత్రెడ్డి మళ్లీ వచ్చి కరెంట్ ఎక్కడ ఉం ది. నాకు కనబడుతలేదు.. ఏడున్నది కరెంట్ అంటున్నాడని, నాకు తె ల్వక అడుగుతున్నా నాకు తెలివిలేదు.
కానీ.. చెన్నూరోళ్లు తెలివైనోళ్లు కదా.. కరెంట్ కనబడతాది కండ్లకెవరికైనా.. అదేమన్న మనిషా కనపడేందుకు.. అని నిలదీశారు. రేవంత్రెడ్డికి బాగా అనుమానాలున్నయ్. ఇక్కడ పోటీ చేసేటాయనకు కూడా బాగా అనుమానాలున్నాయన్నా రు. అందుకే మా తమ్ముడు సుమన్కు నేను చెప్తున్నా.. రెండు ఏసీ బ స్సులు పెడుదాం.. ఓల్వ బస్సులు పెడదాం. మొత్తం ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెసోళ్లను అండ్ల ఎక్కించండి. రేవంత్రెడ్డిని కూడా ఎక్కించుకోండి. బస్సులో బిర్యానీ పొట్లాలు కూడా పెడతాం.. బాధపడకండి. మంచిగా కూసొని తినండి. చెన్నూర్ నియోజకవర్గంలో ఏ మండలానికి పోతరో మీ ఇష్టం.. ఏ ఊరికి పోతరో మీ ఇష్టం.. ఏ టైంకి పోతరో అది కూడా మీ ఇష్టం.. ఎక్కడికికైనా పోయి వరుసగా లైన్ కట్టి నిలబ డి గట్టిగా కరెంట్ తీగలను బిగవట్టుకోండి.
కరెంట్ వస్తదో, వస్తలేదో మీకే ఎరుకైతది. రాష్ట్రానికి కూడా దరిద్రం పోతది. అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెసోళ్లకు కరెంట్ గురించి మాట్లాడే నైతిక హ క్కు ఉందా.. సిగ్గు శరం ఉందా అని మండిపడ్డారు. మీరున్నప్పుడు ఆరు గంటల కరెంట్ అన్నరు.. ఏన్నడైనా మూడు గంటలు సక్కగ ఇ చ్చిండ్రా.. మరి ఇవాళ గా ఇజ్జత్ లేనోళ్లకు ఓటేద్దామా.. గా దౌర్భాగ్య పు పార్టీకి ఓటేద్దెమా.. మళ్లీ ఆ దరిద్రాన్ని తెచ్చుకొని నెత్తిన పెట్టుకుందామా.. యాదికి పెట్టుకోండి.. దరిద్రానికి నేస్తం హస్తం.. అది భస్మాసుర హస్తం.. నెత్తిన పెట్టుకుంటే మాడి మసైపోతమని హెచ్చరించారు.
ఈ టర్మ్లో కరోనా వచ్చి రెండేళ్లు అందరం మూతికి బట్టలు కట్టుకొని తిరిగినం. మరి మా తమ్ముడు బాల్క సుమన్ మొత్తం టర్మ్ అన్న పని చేసిండా అంటే అదీ లేదు. ఆ రెండేళ్లు తీసేస్తే మిగిలిన మూడేళ్లలో ఎట్ల మార్చిండు చెన్నూర్ను పక్కనున్న మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్ వాళ్లు అందరూ అసూయ పడేలా మార్చుకున్నడు అని కేటీఆర్ అన్నారు. సుమన్.. కేసీఆర్ ఇంట్ల కుటుంబ సభ్యుడు, కేసీఆర్ కొడుకులా ఉంటడు. కేసీఆర్ నీడలెక్క వెంటనే ఉంటడు. పార్టీ పని చెబితే మొత్తం మహారాష్ట్ర, ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం.. అంతట తిరుగుతడు. ఉషారోడు కాబట్టి పార్టీ పని చెస్తడు.. అదే సమయంలో చెన్నూర్కు మంచి చేస్తడు. ఒకదిక్కు ఇటు చెన్నూర్ చూసుకుంటూ మూడేళ్లలో గిన్ని పనులు చేసిండు.. బయట పార్టీ కోసం పని చేస్తున్నడు.. గివన్నీ చేస్తుంటే వాడెవడో బయటోడు ఎలక్షన్కు 11 రోజుల ముంగట వచ్చి సుమన్ ఇక్కడ ఉండడు అంటున్నడట.. నేను అడుగుతున్నా ముప్పై ఏండ్లలో మూడు రోజులు ఉండెన వాళ్లు ఎవలన్నా ఇక్కడా? అని ప్ర శ్నించారు.
మరి ఇవాళ వాళ్లు వచ్చి మాట్లాడవచ్చునా.. ఆడ, ఈడ సూట్కేసులు పట్టుకొని దిగి వానికి పైసలిచ్చి, వీనికి పైసలిచ్చి కొనేస్తే ఆగమైదమా.. మారితే మారుతరు కావచ్చు కొంత మంది లంగలు, పైసలకు అమ్ముడుపోయే సన్నాసులు ఉంటరు. మనం మారుతమా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ నాయకులకు చెప్తున్నా.. మీ రు పైసలు ఎక్కవై బలిసి కొట్టుకుంటున్నరు. డిసెంబర్ 3 తరువాత ఎ వలెవలైతే ఇక్కడ డ్రామాలు, నకరాలు చేస్తున్నరో కాంగ్రెసోళ్లు వాళ్ల సంగతి చెప్పే బాధ్యత కూడా మాదే. పక్కా చెప్తున్న ఇది రాసి పెట్టుకోండి. వాళ్ల సంగతి చెప్పుడు పక్కా.. ఇంకొక రెండు రోజులే ఉంది జెర్ర బిగ పట్టుకొని ఉండండంటూ కేటీఆర్ చురకలు అంటించారు.
దళితబంధు మంచి ప్రొగ్రామ్. ఏమైతుందంటే కొంత మందికి వచ్చింది కొంత మందికి రాలేదు. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కాబట్టి అందరికీ జల్ది రావాలనే ఆరాటం ఉంటుందని కేటీఆర్ అన్నా రు. మనం బంతి భోజనానికి పోతే నాలుగు వరుసల్లో కూర్చున్నం అ నుకో మొదాలు ఉన్నోళ్లకు మొదాలు వస్తది, ఆఖర్ల ఉన్నోళ్లకు ఆఖరికి వస్తది. వచ్చుడు పక్కా.. గట్లనే దళితబంధు కూడా అందరికీ వస్తుందన్నారు. సుమన్ కేసీఆర్ కుటుంబ సభ్యుడు అంటే వడ్డించేటోడే మీ వాడు బంతిలో ఏడు కూసున్నా పూలుగు బొక్క పడుతదా.. పడదా.. కచ్చితంగా పడుతదన్నారు. దళితబంధు కూడా ప్రతి ఇంటికీ వస్తది. అది ఇప్పించే బాధ్యత నాది అన్నారు. చాలా మంది నాతో చెప్తున్నరు.
గులిగినా అలిగినా నారాజ్ అయినా మీ మీదే అయితం అంటున్నరు. నడిచే ఎద్దునే పొడుస్తడు ఎవ్వడైనా పండుకున్న దున్నపోతునైతే పొడవడు కదా అంటున్నరు. మళ్ల గెలిచేది మీరే, వచ్చేది మీ సర్కారే కాబట్టి మిమ్ములనే అడుగుతాం.. మీతోనే చేయించుకుంటాం అంటున్నారు. గులుగుతం. అలుగుతం.. కానీ గులుగుడు గులుగుడే.. కారు గుర్తుకు గుద్దుడు గుద్దుడే.. అని చెప్తున్నరన్నారు. సరే మా చెన్నూర్ మంచిగైం ది. చెట్లు మంచిగ పెట్టిండ్రు. కానీ.. నాకు గిది ఇయ్యకపోయే అనేది ఒకటి ఉందన్నారు. అందుకే నేను అందరికీ ఒక్కటే చెప్తున్నానని కొత్త రేషన్కార్డులు, కొత్త పింఛన్లు జనవరి నెలలోనే ఇచ్చుకుందామన్నారు.
ఎవ్వలు రంది పెట్టుకోకండి. తప్పకుండా ఇప్పించే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలందరికీ కల్యాణలక్ష్మి లెక్కనే సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం తెస్తున్నామని నెలకు రూ.3వేలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడున్న ఆసరా పిం ఛన్లు కూడా రూ.2 వేల నుంచి రూ.5 వేలు పెంచుతామన్నారు. రేషన్కార్డు ఉన్నోళ్లందరికీ సన్నబియ్యం, రూ.5 లక్షల బీమా ఇస్తామన్నా రు. ఇవాళ రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని సుమన్ మళ్లీ గెలిస్తే రూ.15 లక్షలు చేసుకుంటామన్నారు. అసైన్డ్ భూములున్న రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామని చెప్పారు. మేమేమో మాకు ఓటు వేసినందుకు ఐదేళ్లలో చెన్నూర్ను ఎట్ల చేసినమో చెప్తున్నామని, మళ్ల గెలిస్తే ఏం చేస్తమో చెప్తున్నాం.
మరి కాంగ్రెసోళ్లు ఏం చెప్తున్నరు. మూడు గం టల కరెంట్ ఇస్త అని ఒకడు చెప్తడు. రైతుబంధు ఎత్తేస్తా అని ఒకడు చె ప్తడు. ఇంకో పుణ్యాత్ముడు ఊర్లకు మళ్ల పట్వారీలను తీసుకొస్తామని చెప్తున్నడు. పట్వారీలు కావాల్నా మళ్ల ఊళ్లళ్ల.. దళారులు కావాల్నా.. రైతుల నెత్తి మీద కూసొని మళ్ల మన బతుకులను ఆగం చేసే దరిద్రం కావాల్నా.. ఆలోచించుకోవాలన్నారు. అందుకే నేనడుగుతున్నా.. మి మ్ములందరినీ బ్రహ్మాండంగా ఈ రోజు చెన్నూర్ను అభివృద్ధి చేసుకుంటున్నాం. తెలంగాణను బాగు చేసుకుంటున్నాం. భవిష్యత్లో ఇంకా బాగా చేయాలి అనుకుంటున్నామన్నారు.
అవతలోళ్లు డబ్బులను నమ్ముకున్నరు. చెన్నూర్లో ఓటుకు రూ.10 వేలు ఇస్తరట.. మంచిగ తీసుకోండి నేను వొద్దు అంటలేను. మీ నోటి కాడి బుక్క నేను గుంజుకొను కనీ.. ఓటు కారు గుర్తుకే వేయండి అని చెప్పారు. మోసాన్ని మో సంతోనే జయించాలే. ముళ్లును ముళ్లుతోనే తీయాలే. ఏం బాధ ప డొద్దు. అవేం వాళ్ల సొంత పైసలు కాదు. కర్ణాటక నుంచి, అక్కడి నుం చి ఇక్కడి నుంచి వచ్చిన దొంగ పైసలే.. వాటికి ప్రమాణాలు, ఇమానాలు ఏం ఉండయ్. అందుకే మంచిగ తీసుకొని కారు గుర్తుకు ఓటేయండి అని పిలుపునిచ్చారు. ఎంపీ వెంకటేశ్ నేతకాని, మాజీ మంత్రి బోడ జనార్దన్, రాజా రమేశ్, సొత్కు సంజీవ్రావు పాల్గొన్నారు.