ఆసిఫాబాద్, జనవరి7 : ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న అక్షింతల పంపిణీ భక్తిశ్రద్ధలతో కొనసాగుతుంది. ఆదివారం ఆసిఫాబాద్లో జిల్లా న్యాయమూర్తి ఎంవీ రమేశ్ దంపతులకు ట్రస్ట్ సభ్యులు రాములోరి అ క్షింతలు అందజేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడు తూ ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, తద్వారా నేరపూరితమైన ఆలోచనలు కూడా రావని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు ఆంజనేయులు, సతీష్బాబు, శ్రీనివాస్, విశాల్, కోటేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, వేణు, మధూకర్, భక్తులు రమేశ్, చంద్రశేఖర్గౌడ్, రాంచందర్, బల్రాం పాల్గొన్నారు.