ఇంద్రవెల్లి, జూన్12 : ఆదివాసీల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగో బా ఆలయంలో మె స్రం వంశీయుల ఉద్యో గ సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్సీ స్కూల్ను శుక్రవారం మెస్రం వంశీయులు నాగోబా ఆలయం పూజలు చేసి ప్రారంభించారు.
ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు నాణ్యమైన వి ద్యను అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలు, నిరుపేద పిల్లలకు ఈ పాఠ శాలలో ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, సర్పంచ్ మెస్రం తుకారాం, మెస్రం వంశీయుల ఉద్యోగుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.