ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని డీసీఎంఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు రామన్న, బాపురావ్, దివాకర్రావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‘వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల తెలంగాణ ధాన్యాగారంగా మారింది. బీడు భూములు కూడా పచ్చదనాన్ని పరుచుకున్నాయి.’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో రూ.1.50 కోట్లతో నూతనంగా నిర్మించిన జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం(డీసీఎంఎస్) కార్యాలయ భవనం, గోదాములను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం వల్ల రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వల్ల 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు.
ఆదిలాబాద్, సెప్టెంబరు 16 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అమలు చేస్తున్న పథకాల ఫలితంగా రాష్ట్రం ధాన్యాగారం గా మారిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదా య, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో రూ.1.50 కోట్లతో కొ త్తగా నిర్మించిన డీసీఎంఎస్ కార్యాలయ భవనం, గోదాములను శనివారం ఆయన ప్రారంభించా రు. ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం సస్యశామలంగా మారిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వల్ల 16 లక్ష ల ఎకరాలకు సాగునీరు అందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు సాగునీరు లభించక ఇబ్బందు లు పడ్డారని వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మిషన్ కాకతీయ, చెక్డ్యాం నిర్మాణంతో చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందిస్తున్నదన్నారు. సర్కారు అందిస్తున్న సహకారంతో రైతులు వానకాలం, యాసంగిలో వరి, ఇతర పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారని తెలిపారు. వ్వవసాయ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగినందున, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఎక్కువగా గోదాముల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో కొత్తగా డీసీఎంఎస్ భవనాల ని ర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఆదిలాబాద్, బోథ్, మంచిర్యాల ఎమ్మెల్యేలు జోగు రా మన్న, రాథోడ్ బాపురావు, దివాకర్ రావు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీఎంఎ స్ చైర్మన్ తిప్పని లింగయ్య, డెయిరీ డెవలప్మెం ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 16: తెలంగాణ ప్రభుత్వమే అంగన్వాడీలను బలోపేతం చేసిందని, అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ముఖ్యమంత్రి తప్పకుండా ఆదుకుంటారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించి న ర్యాలీ మంత్రి నివాసం వరకు కొనసాగింది. అ నంతరం మంత్రిని కలిసి అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రికి విన్నవించగా, ముఖ్యమంత్రి దృష్టికి తీ సుకెళ్లి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. ఈ కా ర్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎస్.ఎన్ .రెడ్డి, సీఐటీయూ నాయకులు సురేశ్, నాయకులు శ్రీనివాస్చారి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజమణి, కార్యదర్శి లలిత, నాయకులు శశికళ, శైలజ, గంగామణి, వెంకటలక్ష్మి, భాగ్యలక్ష్మి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సోమవారం నుంచి గణేశ్ నవరాత్రో త్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ సమీకృత భవనంలో శనివారం సాయంత్రం జిల్లా అధికారులు, మండపాల నిర్వాహకులతో ప్రత్యేక స మావేశం నిర్వహించారు. ఉత్సవాలకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, నిర్వాహకులు పూజలతో పాటు నిమజ్జనోత్సవాన్ని శోభాయామానంగా నిర్వహించుకోవాలని సూచించా రు. విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. నిర్మల్పట్టణంలో రూట్మ్యాప్ తయారు చేసి శోభాయా త్ర నిర్వహించే ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వినాయక సాగర్ వద్ద క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఉన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల ప్రదానోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. జిల్లాస్థాయిలో 17 గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడంతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, అవార్డులు అందించారు. డీపీ వో శ్రీలత, ఆర్డీవో రత్నకల్యాణి పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 16: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఐకేఆర్ ఫౌండేషన్, క్లిమామ్ గోశాల ఆధ్వర్యంలో తయారు చే సిన గోమయ వినాయకులను శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దివ్యారెడ్డి-గౌతం రెడ్డి చేతుల మీదుగా ని యోజక వర్గ వాసులకు ఉచితంగా పంపిణీ చేశా రు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో జరుగుతున్న అనర్థాలను అరికట్టేందుకు గోమయ వినాయకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ చై ర్మన్ ఎర్రవోతు రాజేంధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, అల్లోల తిరుపతి రెడ్డి, ఆయా వార్డుల కౌ న్సిలర్లు నాయకులు తదితరులున్నారు.