నిర్మల్ టౌన్, జనవరి 20 : నిర్మల్ జిల్లాలో ఈ సారి కంది పండించిన రైతుకు రంది పట్టుకున్నది. వాన కాలం సీజన్లో రైతులు అం తర పంటతో పాటు ప్రత్యే కంగా కంది సాగు చేసి నప్పటికీ అధిక వర్షాలు పంట పై తీవ్ర ప్రభావాన్ని చూపా యి. తెగుళ్లు సోకడంతో దిగు బడులపై ఆ ప్రభావం పడిం ది. జిల్లాలో ప్రధానంగా పత్తి పండించే మండలాలైన కుభీర్, కుంటాల, సారంగా పూర్, లోకేశ్వరం, తానూర్, ముథోల్, మామడ తదితర ప్రాంతాల్లో అంతర పంటగా, అదే విధంగా మక్క, సోయా పంటల్లో కందిని సాగు చేస్తారు. ఈ సారి అధికంగా వర్షాలు కురవడంతో కంది పంట ఎదుగుదల లేక పూత, కాత దశలోనే నష్టం వాటిల్లింది. ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే కంది.. ఇప్పుడు కనీసం నాలుగు క్విం టాళ్లకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో హైబ్రిడ్ కందిని సాగు చేస్తుండగా.. పండిన పంటను మా ర్కెట్కు తీసుకురావాలి.
ప్రభుత్వం కందికి క్వింటాల్కు రూ.6,600 మద్దతు ధర ప్రకటించినప్పటికీ గతేడాది రూ.8 వేల వరకు పలికింది. దీంతో ఈసారి తమ కష్టాలు తీరుతాయని భావించి మరోసారి కందిని సాగు చేశారు. కానీ ప్రస్తుతం మా ర్కెట్లో రూ.6,700 నుంచి రూ.7,500 వరకు ధర పలుకుతున్నదని రైతులు పేర్కొంటున్నారు. కంది పంటకు పెట్టుబడి అధికం కావడంతో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలో మాత్రమే కందుల కొనుగోళ్లను ప్రా రంభించారు. దళారులు కుమ్మక్కై ధరను రోజురోజుకూ తగ్గిస్తున్నారని, ఇలాగైతే తమ పరిస్థితి ఏమిటని కంది సాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.