మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, అక్టోబర్ 31(నమస్తే తెలంగా ణ) : నిర్మల్ జిల్లా ఎన్నికల రణక్షేత్రంలో కమలం పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. అభ్యర్థులను ప్రకటించాక ఆ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ముందు నుంచి బీజేపీ కోసం కష్టపడుతూ, నిర్మల్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవిని కాకుండా, రామారావు పటేల్ కు టికెట్ ఇవ్వడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. న మ్మించి గొంతు కోసిన బీజేపీని వదిలి రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో మొన్నే బీఆర్ఎస్లో చేరారు.
అలాగే ఖానాపూర్ టికెట్ రమేశ్రాథోడ్కు ఇవ్వడంతో పెంబి జడ్పీటీసీ జానూబాయి బీఆర్ఎస్లో చేరుతానని ప్రకటించారు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో చర్చలు జరిపారు. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో ఆ ప్రభావం జిల్లా కేంద్రమైన నిర్మల్లోనూ పడనుంది. దీంతో నిర్మల్లో కారుజోరు పెరగ్గా.. కాస్తోకూస్తో ఓట్లు పడుతాయకున్న నియోజకవర్గాల్లో కీలక నాయకులు తిరుగుబాటుతో కమలం కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిం ది. మరోవైపు ప్రచారంలో టాప్ గేర్లో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు.. వివిధ పార్టీల నాయకులను కలుపుకుంటూ ప్రజా మద్దతును కూడగట్టుకుంటూ ముందుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ముథోల్ సెగ్మెంట్లో కారు దూకుడుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆమె రాక తో బీఆర్ఎస్కు ఇక్కడ మరింత బలపడింది. గత రెండు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవికి నియోజకవర్గం లో ప్రత్యేక గుర్తింపు ఉంది. సమాజ సేవకురాలిగా అనేక మం ది పేదలకు అత్యవసర సమయాల్లో ఆమె అండగా నిలిచారు. అంతే కాకుండా మహిళల్లో మంచి పట్టున్న నేతగా కావడంతో ఆమెతో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మరింత పెరిగినైట్లెంది. మరో వైపు ఖానాపూర్ సెగ్మెంట్లో బీజేపీ సీనియర్ నాయకురాలు పెంబి జడ్పీటీసీ బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇక్కడ బీజేపీ అభ్య ర్థి రాథోడ్ను ఓడించాలని ఆమె భావిస్తున్నారు. జానూబాయికి పెంబితో పాటు, కడెం, ఖానాపూర్ మండలాల్లో మంచి పట్టు ఉంది. ఆమె చేరికతో పార్టీకి మరింత బలం చేకూరనుంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ చేసినన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని, జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్కు ప్రజల నుంచి మంచి స్పందన అభిస్తున్నది. పల్లె పల్లెనా కారు జోష్ కనిపిస్తున్నది. అంచనాలకు మించి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో అభ్యర్థు ల్లో కూడా నూతనోత్సాహం కనిపిస్తోంది. మొదటి నుంచి మృ దుస్వభావిగా, చిన్నా, పెద్ద తేడాలేకుండా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న నాయకుడిగా విఠల్రెడ్డికి మంచి పేరు ఉం ది. అలాగే నియోజకవర్గం నుంచి పనుల కోసం హైదరాబాద్ వెళ్లే వారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో భోజన వసతి కల్పించి అవసరమై పనులను దగ్గరుండి చేసి పెట్టడాన్ని ప్రజలు ఎప్పటికీ గు ర్తు చేసుకుంటుంటారు. వీటన్నింటికంటే ముఖ్యంగా గత పదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే ఆయన్ని గెలిపిస్తాయంటున్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికే జై కొడుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గత పదేళ్లలో వంద ల కోట్ల నిధులను తీసుకొచ్చి నియోజకవర్గం రూపురేఖలే మా ర్చేశారన్న పేరుంది.
ఒకవైపు తన నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే.. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధికి బాటలు వేశారు. నిర్మల్ను జిల్లాగా ఏర్పాటు చేయడంలో అల్లోల కృషి మరువలేనిదని ప్రత్యర్థులు సైతం ప్రశంసిస్తున్నారు. అలాగే వందల కోట్లతో గ్రామ గ్రామాన ఆలయాల అభివృద్ధికి కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందంటున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని తప్పుడు విమర్శలు చేసినా, మచ్చలేని మనిషి ఇంద్రకరణ్రెడ్డి గెలుపు పక్కా అని చర్చించుకుంటున్నారు. ఇక కాగా ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జా న్సన్ నాయక్ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. దీంతో ఆయన గెలిస్తే కేటీఆర్ సహకారంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్రావులు ఇటీవల నిర్వహించిన బహిరంగ సభల్లో సైతం జాన్సన్ను గెలిపిస్తే నియోజకవర్గం రూపురేఖలు మార్చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కారణంగానే గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు జాన్సన్ నాయక్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.