ఆదిలాబాద్: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్కు చెందిన సీఎస్ఆర్ విభాగం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) నిమిషానికి 50 లీటర్ల (ఎల్పీఎం) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ ఉపేంద్ర జాదవ్ తో పాటు,హెచ్ఎంఐఎల్ అధికారులు పాల్గొన్నారు.ఈ ప్లాంట్ ద్వారా ఆసుపత్రిలోని దాదాపు 50 ఐసీయులకు ఆక్సిజన్ అందనున్నది. దాదాపు ఓ లక్ష మంది రోగులకు సైతం ఇది సహాయపడనుంది. కోవిడ్ రోగులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలున్న రోగులకు ఆక్సిజన్ అందనున్నది.
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ ఎస్ఎస్ కిమ్ మాట్లాడుతూ ‘ ఆరోగ్య మౌలికవసతులను బలోపేతం చేయడం కోసం వైద్య సిబ్బందికి మద్దతు అందిస్తున్నాం” అన్నారు. ” అనారోగ్యం బారిన పడిన రోగుల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం ఆక్సిజన్ను సరఫరా చేయడం అవసరం. అందుకోసమే మేము ఈ సదుపాయాన్ని ఆసుపత్రిలో ఏర్పాటుచేశామని, అంతేకాకుండా భవిష్యత్ లో కూడా ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.