భైంసా, సెప్టెంబర్ 11 : పట్టణంలో ఆదివారం వర్షం కురిసింది. అంతేకాకుండా మహారాష్ట్ర నుంచి గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరడంతో అధికారులు ఒక గేటును ఎత్తారు. ఇన్ఫ్లో కింద 1000 క్యూసెక్కుల నీరు రావడంతో ఔట్ఫ్లో కింద 1000 క్యూసెక్కుల నీటిని బయట కు వదిలి పెడుతున్నారు.
కడెంలో..
జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 694 అడుగులు (6.338 టీఎంసీల నీరు) వద్ద ఉంది. కాగా, ఆదివారం ఎగువ ప్రాం తాల నుంచి 50,938 క్యూసెక్కుల వరద రావ డంతో అధికారులు 8 క్రస్ట్ గేట్లను ఎత్తి 68,325 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తు న్నారు. మండలంలోని చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. వాగులు, వంకలు పొర్లుతున్నాయి. కాగా, కడెంలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుడి కాలువ ద్వారా 8 క్యూసెక్కులు, ప్రధాన కాలువ ద్వారా 545 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు 8 వరద గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో కింది ప్రాంతాల ప్రజలు గోదావరి పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని ఆయకట్టు ఈఈ రాజశేఖర్ తెలిపారు.
కుంటాలలో..
మండలంలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లా యి. ఓలా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పాత వెంకూర్ గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. సోయా, పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి.
ముథోల్లో..
ముథోల్తో పాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పాటు పలు పంట చేనుల్లో భారీగా నీరు చేరుకుంది.
దస్తురాబాద్లో..
మండలంలో ఏకధాటిగా భారీ వర్షం కురుస్తున్నది. జన జీవనం స్తంభించింది. 22.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమో దైంది. చెరువులు మత్తడి దూకుతున్నాయి. మల్లాపూర్ గోండు గూడెం, మండల కేంద్రంలోని పెద్దమ్మ వాగు, బుట్టాపూర్ శివారులో ఉన్న కలమడుగు వాగు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. చుట్టుపక్కల పంట పొలాలు నీటి మునిగాయి.
సోన్లో..
నిర్మల్, సోన్ మండ లాల్లో రెండ్రోజుల నుంచి భారీ వర్షం కురుస్తు న్నది. సోన్, న్యూవెల్మల్, బొప్పారం, సాకెర, కడ్తాల్, మాదాపూర్, సిద్దులకుంట, లోకల్ వెల్మ ల్, గంజాల్, నిర్మల్ మండలం చిట్యాల్, అక్కా పూర్, వెంగ్వాపేట్, రత్నాపూర్కాండ్లీ, డ్యాంగా పూర్, నీలాయిపేట్, మేడిపెల్లి, తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. చెరువులు మత్తడి దూకుతు న్నా యి. వాగులు, నదులు నిండుగా ప్రవహిస్తు న్నా యి. దీంతో పంటలు అక్కడక్కడ మునిగి పోయా యి. ఆదివారం పొద్దంతా వర్షం పడడంతో జనం బయటకు రాలేదు.
పెంబిలో..
మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కడెం, దొత్తి, పల్కేరు వాగులు ఉధృతంగా ప్రవహిం చాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దొత్తి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాగు ఆవతల ఉన్న గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
స్వర్ణ ప్రాజెక్ట్ గేటు ఎత్తివేత
మండలం లో ని స్వర్ణ ప్రాజెక్ట్ గేటును ఆదివారం ప్రాజెక్ట్ అధి కారులు ఎత్తివేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1182.9 అడుగులుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3100 క్యూసెక్కుల వరద రాగా అప్ర మత్త మైన ప్రాజెక్ట్ అధికారులు ప్రాజెక్ట్ ఒక గేటును ఎత్తి దిగువకు 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.