మంచిర్యాల ఏసీసీ, జనవరి 10: మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అ న్నారు. కాలేజ్రోడ్డులోని మాతా శిశు సంరక్షణ దవాఖానను కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ బీ.రాహుల్, డీఎంహెచ్వో జీ సుబ్బారాయుడితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఎంసీహెచ్లో ప్రసవాలు తక్కువేందుకు జరుగుతున్నాయని ప్ర శ్నించారు.
గత నెల ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎంసీహెచ్ ఉండగా, కరీంనగర్కు కేసులు ఎందుకు పంపుతున్నారని ప్రశ్నించారు. 300 పడకల ప్రభుత్వ దవాఖాన భవన పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దవాఖాన సూపరింటెండెంట్ డా.హరీశ్ చంద్రా రెడ్డి, ఆర్ఎంవో డా.భీష్మా, సూపరింటెండెంట్ డా.వేదవ్యాస్, డీఎస్వో డా.ఫయాజ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.