రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో హరితోత్సవం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకు లు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో వృక్షాల ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు.
కుంటాల, జూన్ 19 : కుంటాల, దౌనెల్లిలో నిర్వహించిన హరితోత్సవంలో బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు పెంచుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కుంటాల పల్లె ప్రకృతి వనంలో సర్పంచ్ సమతతో కలిసి మొక్కలు నాటారు. ఉపాధి కూలీలతో కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, సర్పంచ్లు అహ్మద్, కిషన్, మల్లేశ్, విఠపూర్ లక్ష్మీ రమేశ్, ఎఫ్ఆర్వో రాథోడ్ రమేశ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు రేష్మా, ఇర్ఫానొద్దీన్, బీట్ ఆఫీసర్ శంషోద్దీన్, కోటేశ్, హరిలత, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎంపీవో రహీం, ఎస్ఐ హన్మాండ్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మీవిశారద, ఏఎంసీ డైరెక్టర్లు బొంతల పోశెట్టి, గైని సాయి, బీఆర్ఎస్ నాయకులు జుట్టు మహేందర్, గజేందర్, ఎంపీటీసీ మధు, జాగృతి మండల అధ్యక్షుడు బోగ లక్ష్మణ్, సాయి, తోట రఘు, గజ్జారాం, రమేశ్, రాజు, శ్రీను, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్,జూన్ 19 : అటవీ శాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ అర్బన్ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. సఫారి వాహనంలో అర్బన్ పార్క్లో పర్యటించారు. అటవీ శాఖ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏంపీపీ మొహిద్, ఎంపీడీవో బాల మల్లేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఖలీల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్,ఎఫ్ఆర్వో జీ వినాయక్, ప్రజాప్రతినిధులు, నాయకులు గొర్రె గంగాధర్, పుప్పాల గజేందర్, ఆకుల వెంకాగౌడ్, రాజారెడ్డి, తూం చరణ్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.
సోన్, జూన్ 19 : సోన్ మండలం మాదాపూర్లోని పల్లె చెరువు సమీపంలో నిర్వహించిన హరితోత్సవంలో జడ్పీ సీఈవో సుధీర్కుమార్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, ఎంపీడీవో మోహన్రెడ్డి, ఏపీవో మంజుల, సర్పంచ్ రాజనర్సింహారెడ్డి, ఆయాశాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 19 : జిల్లా కేంద్రంలోని సోఫినగర్లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ మురారి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, పూదరి రాజేశ్వర్, శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్పీ ప్రవీణ్ కుమార్ మొక్కలు నాటారు. డీసీఆర్బీ డీఎస్పీ రవీందర్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్, రమేశ్, రామకృష్ణ, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్డీపీటీ శరవణన్, జిల్లా అటవీ అధికారి సునీ ల్ హెరామత్, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్తో కలిసి మొక్కలు నాటారు. ఎఫ్ఆర్వో జైపాల్ రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మామడ,జూన్19 : లింగాపూర్ అటవీ ప్రాంతంలో పొనికి వనం ఏర్పాటుకు జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్రెడ్డి మొక్కలు నాటారు. వందల ఏళ్ల ఘనచరిత్ర గల నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పొనికి వనం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్వో సునీల్ హిరావత్, డీఆర్డీవో విజయలక్ష్మి, సర్పంచ్ అంబిబాయి, డీసీబీసీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, తహసీల్దార్ ఆరిఫా, ఎంపీవో గోవర్ధన్, ఏపీవో శివాజీ, ఏపీఎం అరుణ ఉన్నారు.
మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ఆదిలాబాద్ రూరల్, జూన్ 19 : మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మావల హరితవనం పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్ కలిసి మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు బహుమతు లు ప్రధానం చేశారు. డీఎఫ్వో రాజేశ్వర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ వనితారాజేశ్వర్, అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు.
బెటాలియన్లో నర్సరీ ప్రారంభం
ఆదిలాబాద్లోని యాపల్గూడ రెండో పోలీస్ బెటాలియన్లో కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీని ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించి మొక్కలు నాటారు. కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, అసిస్టెంట్ కమాండెంట్ పాని పాల్గొన్నారు.
అటవీ, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల శాఖల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చందా(టీ) శివారులో నిర్వహించిన హరిత దినోత్సవంలో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి నీళ్లు పోశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, చిత్ర లేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు, ఉత్తమ సేవలందించిన అటవీ శాఖ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం చందా(టీ) శివారులో దశాబ్ది దినోత్సవ పార్క్ను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. జాతీయ జలశక్తి అవార్డుల విభాగంలో ఉత్తమ అవార్డును స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే, గ్రామస్తులు అధికారులు కలెక్టర్ను సన్మానించారు. ఎంపీపీ రమేష్, జడ్పీటీసీ వనిత పాల్గొన్నారు.
ఎదులాపురం,జూన్19: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హరిత దినో త్సవం నిర్వహించారు. అదనపు ఎస్పీలతో కలిసి మొక్కలు నాటారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి స్థానిక బాలికల గురుకుల కళాశాలలో మొ క్కలు నాటారు. అనంతరం జిల్లా పోలీసులు అన్ని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సమయ్ జాన్రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే కృష్ణ మూర్తి, ఆర్ఐ సీఐలు డీ వెంకట్, ఎం వంశీకృష్ణ, బీ శ్రీపాల్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హ క్, స్పెషల్ బ్రాంచ్,రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, జూన్ 19 : తాంసి మండలం వడ్డాడిలో నిర్వహించిన హరితోత్సవంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, జడ్పీటీసీ తాటిపెల్లి రాజుతో కలిసి సంపద వనాన్ని ప్రారంభించారు. రెండెకరాల విస్తీర్ణంలో 2500 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీ మంజులాశ్రీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముచ్చరేఖ రఘు, ఏపీడీ రవీందర్, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్ బొల్లి సౌందర్య, ఎంపీటీసీ మలపతి అశోక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కౌడల మహేందర్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్, కన్వీనర్ అరుణ్, సర్పంచ్లు వెంకన్న, అండె అశోక్, గజానన్, భారత్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, నరేందర్ పాల్గొన్నారు
నేరడిగొండ, జూన్ 19 : మండలంలో నిర్వహించిన హరితోత్సవంలో ఎమ్మెల్యే రాథోడ్ పాల్గొన్నారు. నేరడిగొండ నుంచి సోమన్న అర్బన్ పార్కు వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అర్బన్ పార్కులో మొక్కలు నాటి నీళ్లు పోశారు. జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్సింగ్, వైస్ చైర్మన్ సంజీవరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, బోథ్, నేరడిగొండ బీఆర్ఎస్ మండల కన్వీనర్లు దామెర్ల నారాయణరెడ్డి, అల్లూరి శివారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దావుల భోజన్న, తిత్రే నారాయణసింగ్, సర్పంచ్ కుమ్రం జంగు, ఇచ్చోడ ఎఫ్డీవో బర్నోబా, ఎఫ్ఆర్వోలు గణేశ్, ప్రణయ్, అటవీశాఖాధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.