నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 3 : మైనార్టీల సంక్షే మానికి ప్రభుత్వం కృషి చేసున్నదని, నిర్మల్ పట్ట ణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిధుల ను త్వరలోనే మంజూరు చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు శనివారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకె ను అందించారు. జిల్లా కేంద్రంలోని చించోలిలో నూతనంగా నిర్మిస్తున్న ఈద్గాకు సంబంధించి అభివృద్ధి పనులు, షాదీ ఖానాకు సంబంధించి రూ.2 కోట్ల నిధులు, గాజుల్పేట్, బర్కత్ పుర, వార్డుల కబురస్థాన్ల అభివృద్ధి చర్యలు, మిగిలి పోయిన మసీద్లకు రావాల్సిన నిధులను త్వరగా మంజూరు చేయాలని మంత్రికి విన్నవించారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఖాజా మాజీదొద్ద్దీన్, సయ్యద్ జహీర్, మోహినొద్దీన్, అన్వర్ పాషా, ముజాయిద్, రఫీయోద్దీన్, సల్మాన్ ఖాన్ తదితరులున్నారు.