బోథ్, జనవరి 26: మండలంలో గణంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ అతిఖొద్దీన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మణ్, కోర్టులో న్యాయమూర్తి హుస్సేన్, పోలీస్ సర్కిల్లో సీఐ కిరణ్కుమార్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రవీందర్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, గాంధీచౌక్లో సర్పంచ్ సురేందర్యాదవ్, జీపీలో కార్యదర్శి అంజయ్య, సొనాల పీహెచ్సీలో డాక్టర్ నవీన్రెడ్డి, బోథ్ సీహెచ్సీలో డాక్టర్ రవీంద్రప్రసాద్, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో గణేశ్, ఎమ్మార్సీలో కోఆర్డినేటర్ ప్రసాద్, ఐసీడీఎస్లో సీడీపీవో సౌందర్య, ఐకేపీలో ఏపీఎం మాధవ్, మార్కెట్ కమిటీ కార్యాలయంలో కార్యదర్శి రాము, ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ ఉమేశ్రావు, ఎస్సీ గురుకులంలో ప్రిన్సిపాల్ స్వర్ణలత, కేజీబీవీలో ప్రత్యేకాధికారి వలిత మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జాతీయ ఓటరు దినోత్సవంలో ఉత్తమ తహసీల్దార్గా అవార్డు అందుకున్న అతిఖొద్దీన్ను బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు.
ఇచ్చోడ(సిరికొండ), జనవరి 26 : ఇచ్చోడ మండలంలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సర్పరాజ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమృత్రావ్, పోలీస్ స్టేషన్లో నీరేశ్, బీఆర్ఎస్ కార్యాలయంలో బియ్యాల మల్లేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే పాఠశాలల్లో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, సీఐ నైలు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జనవరి 26 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సంధ్యారాణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సునీత, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎల్ ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, పశువైద్యశాలలో డాక్టర్ రాథోడ్ జీవన్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ భరత్, జడ్పీటీసీ బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, వివిధ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జనవరి 26: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ పవన్చంద్ర, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎమ్మార్సీలో ఎంఈవో భూమారెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో భాస్కర్, పీహెచ్సీలో డాక్టర్ సద్దాం, పీఏసీఎస్లో సీఈవో నాగభూషణ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాయన్న, పశువైద్యశాలలో డాక్టర్ సుశీల్కుమార్, కళాశాలలో ప్రిన్సిపాల్ రాజ్కిరణ్రెడ్డి, ఐకేపీలో ఏపీఎం లింగరాజు, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, కార్యదర్శులు జాతీయజెండాను ఎగుర వేశారు. పాఠశాలల్లో హెచ్ఎంలు జెండాను ఆవిష్కరించారు.
బజార్హత్నూర్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, పార్టీ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్థానిక తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కూన గంగాధర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాధ, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముజాయిద్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో ప్రమోద్రెడ్డి, వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్ మేకల వెంకన్న, విద్యుత్ సబ్ స్టేషన్లో ఏఈ, పీహెచ్సీలో డాక్టర్ భీంరావ్ జాతీయ జెండాను ఎగరవేశారు.
భీంపూర్, జనవరి26: తాంసి తహసీల్ కార్యాలయంలో డీటీ విష్ణు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఆకుల భూమయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ధనశ్రీ, పీఏసీఎస్లో సీఈవో కేశవ్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో రవీందర్ , బ్యాంకుల్లో మేనేజర్లు, పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలలో ప్రిన్సిపాల్ సుదర్శన్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ మంజుల, వైస్ఎంపీపీ ముచ్చ రేఖ, సర్పంచ్ స్వప్న , నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 26 : భీంపూర్ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ మహేంద్రనాథ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాధిక , పీహెచ్సీలో వైద్యాధికారి విజయసారథి, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న, ఏపీవో సంగీత, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
భీంపూర్, జనవరి 26 : తాంసి మండలం కప్పర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. రూ. 2 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన స్టేజీని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు ప్రారంభించారు. పోలీస్, ఆర్మీ వేషధారణలో విద్యార్థులు కవాతు నిర్వహించారు . సర్పంచ్ కేమ సదానందం, ప్రధానోపాధ్యాయుడు కిష్టన్న , గ్రామస్తులు పాల్గొన్నారు.
తలమడుగు, జనవరి 26 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమాకాంత్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం స్వామి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో మహేందర్, గ్రామ పంచాయతీలో సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట వెంకటేష్, యువజన సంఘాల సభ్యులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్యాణం లక్ష్మీరాజేశ్వర్, జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు జీవన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.