కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెం డేళ్ల క్రితం నాలుగు వరుసల జాతీయ రహదారి-363 పనులు ప్రారంభించారు. రెబ్బెన మండలం రేపల్లెవాడ నుంచి వాంకిడి మండలం గోయగాం వరకు 54కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నా రు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1250 కో ట్లు కేటాయించింది. రెండు మండలాల్లో దాదాపు గా పనులు పూర్తికావస్తుండగా, ప్రస్తుతం వీయూపీ (వెహికిల్ అండర్ పాసింగ్) పనులు కొనసాగుతున్నాయి.
నాసిరకంగా పనులు
జిల్లాలో సాగుతున్న నాలుగు వరుసల రహదారి పనులను గుత్తేదారులు ఇష్టానుసారంగా చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా సాగుతోంద న్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా గుట్టలను తవ్వుతూ జాతీయ రహదారి నిర్మాణం కోసం వాడుతున్నార ని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకమైన మట్టిని వాడుతుండడం వల్ల ఓ వైపు రోడ్డు నిర్మిస్తుండగానే.. మరోవైపు దెబ్బతింటున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల ఆధ్వాన్నంగా మారింది. రహదారి పక్కన నాణ్యమైన మట్టిని నింపాల్సి ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడి నుంచి మట్టిని తీసుకొచ్చినింపుతున్నారు.
మట్టికోసం గుట్టలు మాయం
జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణంలో ైప్లెఓవర్ల వద్ద మట్టిని నింపేందుకు గుట్టను మాయం చేస్తున్నారు. జిల్లాకేంద్రానికి ఆనుకొని ఉన్న రాజూర గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిలో ఉన్న బురుజు వద్ద జేసీబీలతో ఇష్టానుసారంగా మట్టిని తవ్వుతున్నారు. నిత్యం వందలాది భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. దీంతో గుట్ట మార్గం గుండా ఉన్న విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థితికి చేరుకున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
రూ. 2.44 కోట్ల రోడ్డు ధ్వంసం
జాతీయ రహదారి నిర్మాణానికి కావాల్సిన మట్టిని రాజూరా గ్రామం మీదుగా నిత్యం వందలాది వాహనాల్లో తరలిస్తున్నారు. దీంతో రాజూరా గ్రామానికి రూ. 2.44 కోట్లతో వేసిన రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. 2019లో నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రోడ్డు గుంతలమయమై మట్టి రోడ్డును తలపిస్తున్నది. దాదాపు 2కిలోమీటర్ల వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి కాలువలున్న ప్రదేశాల్లో కల్వర్టులు నిర్మించలేదు. రోడ్డపై రాకపోకలు ప్రారంభంకాకముందే ఇలాంటి దుస్థితి ఉంటే.. భవిష్యత్తులో పరిస్థితి ఏమిటని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
మట్టి తరలింపు అనుమతులు ప్రాసెస్లోనే..
రాజూరా గ్రామం సమీపం నుంచి మట్టి తరలింపు అనుమతులు ఇంకా ప్రాసెస్ దశలో ఉన్నాయి. వర్షాకాలం కంటే మందు అనుమతి ఇచ్చాం. వర్షాల కారణంగా అనుమతులు నిలిపివేశాము. తాజాగా మట్టిని తరలించేందుకు అనుమతులు ఇచ్చే ప్రాసెస్ జరుగుతోంది.
– నాగరాజు, మైనింగ్ అధికారి
రోడ్డు పూర్తిగా చెడిపోయింది
జాతీయ రహదారి నిర్మాణానికి కావాల్సిన మట్టిని రాజూరా మీదుగా తీసుకెళ్తున్నరు.రోజూ వందల ట్రిప్పు ల్లో మట్టి తరలిస్తున్నరు. మా ఊరికి మూడేళ్ల క్రితమే రూ. 2.44 కోట్లతో రోడ్డు వేసిన్రు. భారీ వాహనాలు నడిపించడం వల్ల రోడ్డు పూర్తిగా చెడిపోయింది. గుంతలు పడి మట్టి, బురుద రోడ్డులాగా మారింది. మా ఊరి రోడ్డు మీదుగా వాహనాలు వెళ్లవద్దని ఇది వరకు అడ్డుకున్నాం. కొదిరోజులు నిలిపివేసిన్రు. ఇప్పుడు మళ్లీ మట్టి తీసుకెళ్తున్రు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
– తరుణ్, ఆటోడ్రైవర్, రాజూర
ఆటోలు పాడైపోతున్నయ్
మా ఊరి పక్కన ఉన్న గుట్టల నుం చి భారీ టిప్పర్ల ద్వారా మట్టిని తరలి స్తున్నరు. దీంతో రోడ్డు మొత్తం ధ్వంసమైంది. దాదాపు రెండు కిలోమీటర్లు అధ్వానంగా ఉంది. రాజూ ర నుంచి నిత్యం ఆటోల్లో ప్రయాణికు లను తీసుకెళ్తం. రోడ్డు చెడిపోవడం వల్ల మా వాహనాలు పాడవుతున్నాయ్.
– దుడిసె సాగర్, ఆటో డ్రైవర్, రాజూర