ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, నవంబర్ 27: ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలబడుదామని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి అధ్యక్షతన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి జిల్లాలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణ్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో మలిదశ ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించి ఉద్యమాలు చేసినప్పటికీ అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాకపోవడంతో 2009లో కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని తెలిపారు.
‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ’ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున రగిలించి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి ప్రతి గొంతుక తెలంగాణ నినాదంతో పోరాడేలా కృషి చేశారని గుర్తు చేశారు. పోరాడి సాధించిన తెలంగాణలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా 10 సంవత్సరాల పాటు కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. కానీ ఈ పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని పేరొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్తా ముందుండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ప్రజలే బహిరంగంగా చర్చించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
తెలంగాణ సమాజాన్ని ఏకతాటి పైకి తెచ్చిన కేసీఆర్ స్ఫూర్తితో దీక్షా దివస్ను విజయవంతం చేయాలన్నారు. ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ మాట్లాడుతూ ధోకా బాజీ హామీలతో కాంగ్రెస్ గద్దెనెకి ఉచిత బస్సు సౌకర్యం తప్పా ఏ హామీనీ అమలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్లు అలీబిన్ అహ్మద్, సంజీవ్, మాజీ జడ్పీటీసీలు అజయ్ కుమార్ దుర్పతాబాయి, మాజీ ఎంపీపీ సౌందర్య, నాయకులు అన్సార్, రవి, సాజిద్, రవీందర్, యూనుస్ , కలాం, హకీం, మాజీ సర్పంచులు, కార్యకర్తలు తదితరులున్నారు.