ఆదిలాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : మూతబడిన సిమెంటు పరిశ్రమ, ఎయిర్ పోర్టు నిర్మాణం, ఇండస్ట్రీయల్ కారిడార్ విషయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు స్పష్టత ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రామన్న మాట్లాడారు. ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండిస్ట్రీయల్ కారిడార్, సీసీఐ, విమానాశ్రయం నిర్మాణాలపై స్పష్టత లేదని, కేవలం కమిషన్ కోసం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టుపై స్పష్టత ఇవ్వకున్నా ఎమ్మెల్యే డీపీఆర్ పూర్తయిందని దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని, లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేస్తే సహించేది లేదన్నారు.
సీసీఐ ప్రైవేటీకరణ
కేంద్ర మంత్రులు మూతబడిన ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను తిరిగి ప్రారంభిస్తామని హామీలు ఇచ్చి పక్కన పెట్టారని, పరిశ్రమ తు క్కును వేలం వేసి ప్రైవేటీకరణ కోసం ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభు త్వం ఆదిలాబాద్ను ఏరోస్పేస్ జోన్గా గుర్తిం చి ఎయిర్పోర్టు నిర్మాణానికి రూ.8 కోట్లతో సర్వే చేపట్టినట్లు తెలిపారు. సర్వేలను ఇప్పుడున్న నాయకులు అడ్డుకున్నారు. ఎలాంటి ఎంవోయూలు, డీపీఆర్లు లేకపోయినా ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయిందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలకు పూ ర్తి వివరాలు వెల్లడించకపోతే ఎంపీ, ఎమ్మెల్యే ల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామన్నా రు. బీఆర్ఎస్ నాయకులు విజ్జగిరి నారాయ ణ, అజయ్, ప్రహ్లాద్, అశోక్ స్వామి, వసంత్, గణేశ్, పరమేశ్వర్, రాజు పాల్గొన్నారు.