చుట్టూ పచ్చని చేలు.. అక్కడక్కడా పూల వనాలు.. ఏపుగా పెరిగిన చెట్లు.. నీలిరంగు రూపంలో పొలాలకు నీరందించే కాలువ.. రవాణాకు సౌకర్యవంతంగా పొడవైన రహదారి.. మొత్తానికి కనుచూపు మేర పచ్చదనం.. ఈ ఆకుపచ్చని అద్భుతం మధ్య ముక్రా(కే) గ్రామం.
ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న ఈ గ్రామం ప్రగతికి ప్రతిరూపంగా నిలుస్తున్నది. 700 జనాభా ఉన్న ఈ పల్లె రాష్ట్ర సర్కారు ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. కాగా.. ఊరి పొలిమేరలో ఉన్న ముక్రా(కే) వాగుపై రాష్ట్ర సర్కారు రూ.2.50 కోట్లతో చెక్ డ్యాం నిర్మించగా.. 400 ఎకరాలకు సాగునీరు అందుతోంది.
– ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్, సెప్టెంబర్ 16