ఆదిలాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ) : ‘మోసగాళ్లకు మోసగాళ్లు, దొంగలకు దొంగలు అనే రీతిలో కేంద్రంలోని బీజేపీ పాలన కొనసాగుతోంది. ఎనిమిదేళ్లుగా పేదల ఊసురు పోసుకుంటున్నదని, పెరిగిన ధరలు, పరిశ్రమల మూసివేత, మహిళలపై అత్యాచారాలు, చిరుద్యోగులపై వివక్ష, మతం పేరిట చిచ్చు పెడుతున్న మో దీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి.’ అని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కోరారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి, అక్రమా లు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీపీఎం పొ లిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడారు. మోదీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రూ.15 లక్షల చొప్పున పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం 240 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తున్నదని, రైల్వేలు, విమానాశ్రయాలు, బ్యాంకులకు బడా పారిశ్రామిక వేత్తలైన అదానీ, అంబానీ కంపెనీలకు కట్టబెడుతున్నదన్నారు. కేంద్రంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులపై మోదీ సర్కారు ఐటీ, ఈడీలతో దాడులు చేయిస్తున్నదని, ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నదన్నారు. విభజన చట్టం లో భాగంగా తెలంగాణకు గిరిజన యూనివర్సిటీని ఎందుకు మంజూరు చేయడం లేదన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. సీపీఐని ప్రారంభిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పరిశ్రమ విషయం లో ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. సీసీఐకి భూములిచ్చిన రైతులు ఉద్యోగాలు కోల్పో యి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీసీఐ విషయంలో ఎంపీ, బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఏ యిర్పోర్టు ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా.. కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆగడాలను ప్రజలకు వివరించడానికే జన చైతన్య యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆదిలాబాద్ పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ప్రధాని నరేంద్రమోదీ తన మాయమాటలతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మన్కీ బాత్ పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. పెట్రోల్, డీజిల్, సిలిండర్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా ప్రజలు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్ శక్తులకు కేంద్రం అండగా నిలుస్తున్నదని మండిపడ్డారు. 47 ఏండ్ల కాంగ్రెస్, తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ప్రయోజనం చేకూరలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, పేదలు, ఇతర వర్గాల అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నిర్వహించే జన చైతన్య యాత్రకు తమ సహకారం ఉంటుందన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, నాయకులు జయలక్ష్మి, బండి దత్తాత్రి, లంక రాఘవులు, ఆశయ్య, స్కైలాబ్ బాబు, అడివయ్య, బాలకృష్ణ, జగదీశ్, కాంగ్రెస్ జి ల్లా అధ్యక్షుడు సాజిద్ఖాన్, నాయకురాలు సుజాత, సీపీఎం నాయకుడు ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.