నెన్నెల, ఏప్రిల్ 27 : నెన్నెలలోని బొమ్మెన హరీశ్గౌడ్కు చెందిన మినీ రైస్ మిల్లులో శనివారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జ రిగింది. మిల్లు ఆపరేటర్ వెంకటేశ్ 3 గంటల ప్రాంతంలో మిల్లు వద్దకు వచ్చాడు. షెటర్ తెరిచి చూడగా, లోపల మంటలు కనిపించా యి. చుట్టు పక్కల వారిని పిలువగా, వారు వచ్చి నీళ్లు చల్లి మంటలార్పివేశారు. కరంట్ మీటర్లు, ఆపరేటింగ్ మిషన్లు, స్టాటర్లు, కేబుళ్లు, బియ్యం, ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి.
సుమారు రూ. 5 లక్షల దాకా న ష్టం వాటిల్లినట్లు యాజమాని బొమ్మెన హరీశ్గౌడ్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ని ప్పు పెట్టినట్లు అనుమానాలున్నాయి. ఘట నా స్థలంలోఅగ్గిపెట్టె కనిపించడంతో పాటు రేకు తలుపు వంగి ఉండడంతో హరీశ్గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెల్లంపల్లి ఎ మ్మెల్యే గడ్డం వినోద్ రైస్ మిల్లును పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నా రు. బెల్లంపల్లి ఏసీపీ రవికూమార్తో ఫోన్లో మాట్లాడి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట నాయకులు గట్టు మల్లేశ్, మల్లాగౌడ్, చెన్నోజి శంకరయ్య ఉన్నారు.