ఆసిఫాబాద్ : మంచి కోసం, ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన యోధులను స్మరించుకోవాలని కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శనివారం కుమ్రంభీం, ఎడ్లకొండు వర్థంతి వేడుకల్లో భాగంగా వారి విగ్రహాలను ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సుదీంద్ర, డీఎఫ్వో శాంతారాంతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి కోసం పోరాటం చేసిన కుమ్రంభీం, ఎడ్ల కొండు లాంటి మహనీయుల చరిత్ర భావితరాలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం పొడు భూముల సమస్యలకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. అర్హులైన రైతులకు ఎలాంటి నష్టం జరుగదని స్పష్టం చేశారు.