ఎదులాపురం, జూలై 12 : ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. మంగళవారం జిల్లా కేంద్రంలోని మోచిగల్లిలో ఫీవర్ సర్వేను డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్ పరిశీలించారు. సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూనే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. గతేడాది డెంగీ, మలేరియా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా రిమ్స్, పీహెచ్సీకి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో డీఎంవో మెట్పెల్లివార్ శ్రీధర్, అడిషనల్ డీఎంహెచ్వో శ్రీకాంత్, ప్రోగ్రాం అధికారులు పవన్కుమార్, క్రాంతి కుమార్, వార్డు కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్ కుమార్, వార్డు ప్రత్యేక అధికారి వెంకటేశ్, నవీన్ కుమార్, ఏఎన్ఎంలు విజయలక్ష్మి, ఎస్కే.ఇర్ఫానా, రాజశ్రీ, ఆర్పీ జమున పాల్గొన్నారు. i